హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఎమ్మెల్యేల బేరసారాల కేసు..రేపే నందకుమార్ ఈడీ విచారణ..సర్వత్రా ఉత్కంఠ

ఎమ్మెల్యేల బేరసారాల కేసు..రేపే నందకుమార్ ఈడీ విచారణ..సర్వత్రా ఉత్కంఠ

రేపే నందకుమార్ ఈడీ విచారణ

రేపే నందకుమార్ ఈడీ విచారణ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రేపు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న నందకుమార్ ను రేపు ఈడీ అధికారులు విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న నందకుమార్ ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. 3రోజుల పాటు నందకుమార్ ను అనుమతించడానికి అనుమతి ఇవ్వాలని ఈడీ కోరింది. కానీ ఒక్కరోజు మాత్రమే ఈడీ విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో రేపు జైల్లోనే అధికారులు నందకుమార్ ను  విచారించనున్నారు. మరి రేపటి విచారణలో నందకుమార్ ను ఈడీ ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది? నందకుమార్ సమాధానం ఏం చెప్తారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రేపు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న నందకుమార్ ను రేపు ఈడీ అధికారులు విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న నందకుమార్ ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. 3రోజుల పాటు నందకుమార్ ను అనుమతించడానికి అనుమతి ఇవ్వాలని ఈడీ కోరింది. కానీ ఒక్కరోజు మాత్రమే ఈడీ విచారణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో రేపు జైల్లోనే అధికారులు నందకుమార్ ను  విచారించనున్నారు. మరి రేపటి విచారణలో నందకుమార్ ను ఈడీ ఎలాంటి ప్రశ్నలు అడుగుతుంది? నందకుమార్ సమాధానం ఏం చెప్తారు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Hyderabad: రూ.400 కోసం దారుణ హత్య..హైదరాబాద్ బాలానగర్ లో ఘటన

నందకుమార్ ఈడీ విచారణ నేపథ్యంలో రోహిత్ రెడ్డి (Pilot Rohith Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ రెడ్డి సోదరునితో నందకుమార్ వ్యాపారాలకు సంబంధించిన అంశాలపై ఈడీ  (Enforcement Directorate) విచారించనుంది. నన్ను ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. అందుకే నందకుమార్ నుండి ఇష్టమొచ్చిన స్టేట్ మెంట్ తీసుకోనున్నట్టు తెలిపారు. నన్ను అరెస్ట్ చేసిన మీకు లొంగేది లేదు. ఇది రోహిత్ ఒక్కడి సమస్య BRS సమస్య కాదు యావత్ తెలంగాణ సమస్య. మీరు నన్ను, నా కుటుంబంపై ఎన్ని కుట్రలు చేసినా తగ్గదే లేదని రోహిత్ రెడ్డి తేల్చి చెప్పారు. నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో నందకుమార్ ద్వారా నన్ను ఇరికించాలని చూస్తున్నారన్నారు.

Vyshali Kidnap Case: వైశాలి కిడ్నాప్ కేసు..నవీన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం..సీన్ రీకన్‌స్ట్రక్షన్ కంప్లీట్

అసలు కేసు ఏంటి?

అక్టోబర్ 26న ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలును పోలీసులు భగ్నం చేశారు. ఒక్కొక్కరికి రూ.50 కోట్లు చొప్పున డీల్ కోసం రాంచంద్రభారతి, నందకుమార్, సింహయాజి మంతనాలు జరిపారు. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ ఎమ్మెల్యేలలో రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు ఉన్నారు. అయితే  ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ కుట్ర పన్నిందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ కొత్త కుట్రకు పూనుకున్నాడని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు.

మరి రేపటి నందకుమార్ విచారణలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయనేది ప్రస్తుతానికి సస్పెన్సే.

First published:

Tags: Bjp, BRS, Enforcement Directorate, Hyderabad, Telangana, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు