హోమ్ /వార్తలు /తెలంగాణ /

Breaking News: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..ఈనెల 6న హైకోర్టు తీర్పు

Breaking News: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు..ఈనెల 6న హైకోర్టు తీర్పు

తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు

ఎమ్మెల్యేల కొనుగోలు (MLAa Poaching Case) కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. మొదట ఈ కేసును సిట్ (Special Investigation Team) దర్యాప్తు చేసింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో సీబీఐ (Central Burew Of Investigation) కి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే సీబీఐ  (Central Burew Of Investigation) విచారణ అవసరం లేదని ప్రభుత్వం సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ అప్పీల్ పై ఈనెల 6న హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. దీనితో ఈ కేసు సీబీఐ  (Central Burew Of Investigation) చేతుల్లోకి వెళుతుందా లేదా అనే విషయం సోమవారం తేలనుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎమ్మెల్యేల కొనుగోలు (MLAa Poaching Case) కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. మొదట ఈ కేసును సిట్ (Special Investigation Team) దర్యాప్తు చేసింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో సీబీఐ (Central Burew Of Investigation) కి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే సీబీఐ  (Central Burew Of Investigation) విచారణ అవసరం లేదని ప్రభుత్వం సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ అప్పీల్ పై ఈనెల 6న హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. దీనితో ఈ కేసు సీబీఐ  (Central Burew Of Investigation) చేతుల్లోకి వెళుతుందా లేదా అనే విషయం సోమవారం తేలనుంది.

ఈటెల, భట్టి విక్రమార్కతో కేటీఆర్ ముచ్చట..అసెంబ్లీలో ఇంట్రెస్టింగ్ సీన్..ఇంతకీ ఏం మాట్లాడుకున్నారంటే?

కోర్టులో వాడీవేడి వాదనలు..

ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగించాలన్న తీర్పును సవాల్ చేస్తూ..సర్కార్ దాఖలు చేసిన పిటీషన్ పై జనవరి 6న కోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వివరాలు కోరుతూ సీఎస్ కు లేఖ రాశామని హైకోర్టుకు సీబీఐ  (Central Burew of Investigation) పేర్కొంది. సిట్ మాకు ఎలాంటి డాకుమెంట్స్ ఇవ్వలేదు. ఇస్తే దర్యాప్తు చేస్తామని సీబీఐ తెలపగా..హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఆగాలని కోర్టు సీబీఐ (Central Burew of Investigation)కి సూచించింది.  సిబిఐ వాదన కూడా వింటామని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు సిట్ నుండి సీబీఐకి అప్పగించడానికి మొత్తం 45 కారణాలను కోర్టు పేర్కొంది.

PM Modi Tweet: తెలంగాణపై ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్..రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టు!

ఈ కేసుకు సంబంధించి బీజేపీ తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు. బీజేపీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చలేదు. అలాగే ఒక్క ఎమ్మెల్యేను కానీ కొనుగోలు చేయలేదు. 2014 నుంచి 37 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని దామోదర్ రెడ్డి వాదించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేరాలని కేసీఆర్ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారని దామోదర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్ నుంచి సీబీఐ చేతికి దర్యాప్తు బాధ్యతలు చేరగా..ప్రభుత్వ అప్పీల్ కోర్టు వ్యాఖ్యలతో సీబీఐ దర్యాప్తు చేపట్టలేదు. అయితే సోమవారం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా..లేక సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సమర్థిస్తుందో తెలియాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే.

First published:

Tags: CBI, Telangana, Telangana High Court, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు