మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఐటీ, పురపాలశాఖ మంత్రి కేటీఆర్ మహిళా పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని అక్రిడేషన్ కలిగిన ప్రతి మహిళా జర్నలిస్ట్ కోసం హెల్త్ చెకప్ క్యాంప్లు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల్ని, ఆడవాళ్లను గౌరవించాల్సిన బాధ్యతను పాత్రికేయులే తీసుకోవాలని చెప్పారు మంత్రి కేటీఆర్. అంతే కాదు మహిళా పాత్రికేయులంతా యూనియన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా పాత్రికేయ రంగంలో రిపోర్టర్లు, యాంకర్లు, న్యూస్ ప్రెజెంటర్స్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని మంత్రి కేటీఆర్ అభినందించి సన్మానించారు. హానరింగ్ విమెన్ ఇన్ జర్నలిజం పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు. ఆయనతో పాటు సీఎస్ శాంతికుమారి, మంత్రులు, సబితాఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్,జగదీష్రెడ్డి పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: KTR, Telangana News