టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLAs Poaching Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతీ (Rama chandra bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji)లకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ మంజూరులో కొన్ని షరతులు పెట్టింది హైకోర్టు. ప్రతీ సోమవారం సిట్ (Special Investigaion Team) ముందుకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రూ.3 లక్షల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురి పాస్ పోర్టులను కోర్టులో సరెండర్ చేయాలనీ, ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లోద్దని హైకోర్టు (Telangana High Court) పేర్కొంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి నిన్న హైకోర్టు (High Court) లో వాదనలు వాడీవేడిగా కొనసాగాయి. ఈ కేసుకు సంబంధించి పిటీషన్లపై విచారణ చేపట్టింది హైకోర్టు. ఈ కేసులో ప్రభుత్వం తరపున దుష్వంత్ దవే, బీజేపీ తరపున మహేష్ జెఠ్మలానీ తమ వాదనలు వినిపించారు. అలాగే నిందితుల బెయిల్ పై కూడా విచారణ జరిగింది. కానీ నిన్న బీజేపీ లాయర్, ప్రభుత్వం తరపు లాయర్ వాదనలతోనే కోర్టు సమయం అయిపోయింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
తప్పు చేయనప్పుడు భయమెందుకు..ప్రభుత్వం తరపు న్యాయవాది దవే
తప్పు చేయనప్పుడు తెలంగాణ సిట్ (Special Investigation Team) కు ఎందుకు సహకరించడం లేదు, దేనికి భయపడుతున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్వంత్ దవే నిన్న వాదనలు వినిపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయి. నిందితులతో బీజేపీకి సంబంధాలు ఉన్నాయని దవే చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొల్లగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను కేసీఆర్ వీడియో ద్వారా బయటపెట్టారు. ప్రభుత్వాన్ని కూల్చుతుంటే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత సీఎంపై ఉంటుందని అన్నారు. కేసీఆర్ వీడియోలను బయటపపెట్టడాన్ని తప్పుగా చూయించడం ఏంటని దవే వాదనలు వినిపించారు. సిట్ (Special Investigation Team) విచారణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్వంత్ దవే కోర్టు ముందు చెప్పారు. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకే సిట్ (Special Investigation Team) దర్యాప్తు చేస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్వంత్ దవే చెప్పుకొచ్చారు.
రాజకీయ దురుద్దశ్యంతోనే సిట్ ఏర్పాటు..
ఈ కేసు రాజకీయ దురుద్దేశ్యంతోనే సిట్ (Special Investigation Team) ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారని బీజేపీ తరపు న్యాయవాది మహేష్ జెఠ్మలానీ చెప్పుకొచ్చారు. కేసీఆర్ కనుసన్నుల్లోనే సిట్ (Special Investigation Team) విచారణ జరుగుతుందన్నారు. ఈ కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని బీజేపీ సహా నిందితుల తరపు న్యాయవాదులు కోరుతున్నారు. ఇక తదుపరి విచారణ డిసెంబర్ 6కు వాయిదా వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana, Trs, TRS MLAs Poaching Case