హోమ్ /వార్తలు /తెలంగాణ /

SAD NEWS : భార్య వేరే వ్యక్తి ఇంట్లో ఉందని తెలిసి వీడియో కాల్ చేసి ఉరివేసుకున్న భర్త ..

SAD NEWS : భార్య వేరే వ్యక్తి ఇంట్లో ఉందని తెలిసి వీడియో కాల్ చేసి ఉరివేసుకున్న భర్త ..

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Suicide: భార్య తన మాట వినలేదని హర్ట్ అయ్యాడు. తాను సీరియస్‌గా చెబితే ఆమె పట్టించుకోకపోవడంతో అవమానంగా ఫీలయ్యాడు. ఎలాగైనా ఆమెపై రివేంజ్ తీర్చుకోవాలని చివరకు అంత పని చేశాడు ఓ భర్త.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సర్ధుకుపోయే స్వభావం కాదు. సర్ది చెప్పుకునే నేర్పు లేదు. సంసారంలో తలెత్తే చిన్న చిన్న సమస్యల్ని తట్టుకునే సహనం లేదు. కేవలం తన మాట నెగ్గలేదనే కోపంతో ఓ భర్త కట్టుకున్న భార్యపై రివేంజ్‌(Revenge)తీర్చుకోవాలనుకున్నాడు. కేవలం కాసేపు మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే విషయాన్ని ప్రాణాలు తీసుకునేంత సీరియస్‌ మ్యాటర్‌(Serious matter)గా మార్చేశాడు. ఫలితంగా అతను ప్రాణాలు కోల్పోయాడు. భార్యను భర్తలేని విదవరాలిగా మార్చాడు. హైదరాబాద్‌(Hyderabad)లో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

Murder : మాజీ మంత్రి తుమ్మల అనుచరుడ్ని వేటాడి చంపిన దుండగులు .. అందరి అనుమానం అతనిపైనే



అవమానంగా ఫీలయ్యాడు...

తుక్కుగూడకు చెందిన సాయికార్తీక్‌గౌడ్ అనే 33సంవత్సరాల వ్యక్తి రవిళి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ అన్యోన్యంగానే జీవిస్తున్నారు. అయితే ఈనెల 12వ తేది నాడు సాయికార్తీక్‌గౌడ్, రవళి కందుకూరు మండలం బేగంపేటలోని బంధువుల వివాహానికి వెళ్లారు. పెళ్లి అయిపోగానే రవళి అక్కడే ఉంది. కార్తీక్ తిరిగి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పహాడి షరీఫ్‌కి శనివారం వచ్చాడు. అయితే ఆదివారం తన అత్తయ్య వాళ్లు బోనాల పండుగ చేసుకుంటున్నారని...కాబట్టి త్వరగా వస్తే మీర్‌పేటలోని అత్తయ్య ఇంటికి వెళ్దామని కార్తీక్‌ భార్యకు ఫోన్‌ చేసి చెప్పాడు. అందుకు రవళి భర్త ఫోన్‌కాల్‌ని సీరియస్‌గా తీసుకోలేదు.

భార్యపై కోపంతో అలా చేశాడు..

ఫోన్ చేసి చెప్పినప్పటికి భార్య తన మాట లెక్కచేయలేదని అవమానానికి గురయ్యాడు సాయికార్తీక్‌గౌడ్. భార్య ప్రవర్తించిన తీరుతో తీవ్రమనస్థాపానికి గురైన కార్తీక్ మరోసారి రవళికి వీడియో కాల్ చేశాడు. మీ బంధువుల ఇళ్లలో జరిగే అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్న ..మా బంధువుల ఇళ్లలో జరిగే వేడుకలకు ఎందుకు రావడం లేదని కోపంతో చెప్పాడు. అంతటితో ఆగకుండా వీడియో కాల్‌లోనే తన మాట లెక్కచేయని కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఇంటి పైకప్పుకు ఉరివేసుకొని ఫోన్‌ని పడేశాడు. ఫోన్‌లో ఏమీ కనబడకపోవడంతో రవళి భయాందోళనకు గురైంది. వెంటనే తమ ఇంటి చుట్టు పక్కల ఉంటున్న వాళ్లకు ఫోన్ చేసి తన భర్త ఉరివేసుకున్నాడని ఎలాగైనా రక్షించమని ప్రాధేయపడింది.

BJP VS TRS : బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్రలో ఘర్షణ .. రాళ్ల దాడిలో గాయపడ్డ బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు



చేయని తప్పుకు ఇద్దరికి శిక్ష..

హుటాహుటిన తుక్కుగూడలోని తన ఇంటికి కూడా వెళ్లింది. అయితే ఆమె ఇంటికి చేరుకునేసరికి కార్తీక్ చనిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు స్పాట్‌కి చేరుకున్నారు. కార్తీక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

First published:

Tags: Husband commit suicide, Telangana crime news

ఉత్తమ కథలు