HYDERABAD COMPLAINT THAT THE ADOPTIVE SON KILLED THE WOMAN IN SAROOR NAGAR HYDERABAD SNR
OMG:మదర్స్ డే ముందు రోజే ఓ మాతృమూర్తి హత్య..చంపింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
(పెంచి పోషించిన తల్లినే..)
Hyderabad:సరూర్నగర్లో మాతృదినోత్సవానికి ఒక రోజు ముందే ఓ మాతృమూర్తి హత్యకు గురైంది. ఇంట్లో డబ్బు, ఆమె ఒంటిపై ఉన్న నగల కోసం ఆమె దత్తత తీసుకున్న కుమారుడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
డబ్బు పిచ్చి పట్టుకున్న నగదు, నగల కోసం వృద్ధులు, ఒంటరి మహిళల్నే టార్గెట్గా చేసుకొని ఘాతుకాలకు ఒడిగడుతున్నారు. పెంచి, పోషించారనే విశ్వాసం, కన్నబిడ్డలా చూసుకున్నారనే మానవత్వం మరిచిపోయి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్(Hyderabad) సరూర్నగర్(Saroor Nagar)లో ఇదే తరహాలో ఓ దారుణం జరిగింది. పీ అండ్ టీ కాలనీలో ఉంటున్న భూదేవి (Bhudevi)అనే 58సంవత్సరాల మహిళ(58 Year old woman) అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్తలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు భూదేవి శరీరంపై ఉండాల్సిన బంగారు నగల(Gold Jewelry)తో పాటు ఇంట్లోని డబ్బు(Cash) కూడా అపహరణకు గురవడంతో భూదేవిని హత్య చేసినట్లుగా ప్రాధమికంగా నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం(Postmortem) నిమిత్తం ఆసుపత్రి(Hospital)కి తరలించారు. మృతురాలి బంధువులు మాత్రం భూదేవి మరణానికి ఆమె దత్తపుత్రుడు(Adoptive son) సాయితేజపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతనే డబ్బు, నగల కోసం ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని ఆరోపిస్తూ సాయిచరణ్(Saiteja)పై కంప్లైంట్(Compliant)చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మదర్స్ డే ముందు రోజే మర్డర్..
తెల్లారితే మాతృదినోత్సవం. అంతకు ముందు రోజే ఇంతటి దారుణం జరగడంపై స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భూదేవి హత్య జరిగిన సమయంలో దత్తపుత్రుడు సాయిచరణ్ ఇంట్లో లేకపోవడంతో అతనే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడనే అనుమానాలు బలపడుతున్నాయి. అలాగే భూదేవితో వేరే వ్యక్తులకు ఎలాంటి విభేదాలు, గొడవలు లేవని స్థానికులు చెబుతున్నమాట. దుండగులు, గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడి చేసిన ఆనవాళ్లు కూడా లేకపోవడంతో..కచ్చితంగా ఇది ఇంట్లో ఉంటున్న దత్తపుత్రుడు సాయిచరణ్ చేసిన దారుణంగానే భావిస్తున్నారు. ఇంట్లోని 30తులాల నగలతో పాటు క్యాష్ని ఎత్తుకెళ్లాడు సాయితేజ.
దత్త పుత్రుడే హంతకుడు..
దత్తత తీసుకొని కన్నకొడుకులా చూసుకుంటున్న భూదేవిని సాయితేజ డబ్బు, నగల కోసమే హతమార్చాడనే వార్తను స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. నమ్మద్రోహమే కాదు..చివరకు రక్తసంబంధంగా ముడిపడిన తల్లి,కొడుకుల బంధాన్ని కేవలం డబ్బు, నగల కోసం ఎలా తెంచుకోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. సరూర్నగర్ పోలీసులు మాత్రం కేసు దర్యాప్తు చేపట్టామని..త్వరలోనే భూదేవి హత్యకు కారకులైన వారిని తప్పని సరిగా పట్టుకొని కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.