హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: సాహితీవేత్త, ఆధ్యాత్మివేత్త అష్టకాల నృసింహరామశర్మ మృతి ..సీఎం కేసీఆర్ సంతాపం

Telangana: సాహితీవేత్త, ఆధ్యాత్మివేత్త అష్టకాల నృసింహరామశర్మ మృతి ..సీఎం కేసీఆర్ సంతాపం

Ashtakala Nrisimharama Sharma

Ashtakala Nrisimharama Sharma

Telangana:ప్రముఖ సాహితీవేత్త, ఆధ్యాత్మికవేత్త, అష్టావధాని అష్టకాల నృసింహరామశర్మ హఠాన్మరణం చెందారు. గొప్ప సాహితీవేత్త మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రముఖ సాహితీవేత్త, ఆధ్యాత్మికవేత్త, అష్టావధాని అష్టకాల నృసింహరామశర్మ (Ashtakala nrisimhara sharma) హఠాన్మరణం చెందారు. 08-02-2023 బుధవారం(Wednesday) రాత్రి 11:00 గం కి గుండెపోటుతో పరమపదించారు..సాహిత్య రంగంలో ఆధ్యాత్మిక రంగంలో ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఆయన సేవలు సిద్దిపేట(Siddipet) ప్రాంతానికే వన్నె తెచ్చాయి. నార్సింగి జెడ్పీ పాఠశాలలో తెలుగు పండిత్ గా విద్యాబుద్దులు నేర్పారు. తాను పనిచేస్తున్న పాఠశాల ప్రాంతంలో ఎప్పుడు అష్టావధానం చేయలేదు.  కాని విద్యార్థుల కోసం మొదటి సారి అష్టావధానం నిర్వహించారు. గొప్ప సాహితీవేత్త మరణించడం పట్ల తెలంగాణ(Telangana)ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) సంతాపం ప్రకటించారు.

Telangana: అద్దె వాహనాల పేరుతో ప్రజాధనం స్వాహా .. బయటపడ్డ కార్పొరేషన్‌ అధికారుల కక్కూర్తి

సాహితీవేత్తకు సీఎం సంతాపం..

ఆధ్యాత్మిక సాహితీవేత్తగా, ఆయా రంగాలకు అష్టకాల నృసింహరామశర్మ చేసిన సేవలు చిరస్మ రణీయమని సీఎం కేసీఆర్ కొనియాడారు. అష్టకాల గారి ఆధ్మాత్మిక సాహిత్య కృషి సిద్ధిపేట ప్రాంత కీర్తి ప్రతిష్టలను మరింతగా ఇనుమడింపచేశాయన్నారు. వారితో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అష్టకాల నృసింహరామశర్మ హఠాన్మరణం సాహిత్య,ఆధ్యాత్మిక రంగాలకు తీరని లోటని ఆయన మరణం పట్ల పలువురు సాహితీవేత్తలు,ఆధ్యాత్మికవేత్తలు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.

రేపు అంత్యక్రియలు

అనంతసాగర్ శ్రీ సరస్వతీ క్షేత్ర నిర్మాత బ్రహ్మ శ్రీ అష్టకాల నృసింహరామశర్మ అంత్యక్రియలు శుక్రవారం రోజున 10 గంటలకు అనంతసాగర్ నందు జరుగును.

First published:

Tags: CM KCR, Siddipet, Telangana News

ఉత్తమ కథలు