హోమ్ /వార్తలు /తెలంగాణ /

Business Idea: రైతులను కోటీశ్వరులను చేసే పంట.. 4 నెలల్లో జీవితమే మారుతుందట..!

Business Idea: రైతులను కోటీశ్వరులను చేసే పంట.. 4 నెలల్లో జీవితమే మారుతుందట..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

 ఉత్తరప్రదేశ్‌కు చెందిన దుర్గాప్రసాద్ అనే రైతు దోసకాయ సాగుతో లక్షల ఆదాయం పొందుతున్నాడు. కేవలం 4 నెలల్లో రూ. 8 లక్షలు సంపాదించాడు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం ఎంతో మంది యువత తమ జాబ్స్‌ని వదిలిపెట్టి సొంతూళ్లకు వెళ్తున్నారు. తల్లిదండ్రుల వద్ద ఉంటూ సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. అందులోనూ వ్యవసాయానికి (Agriculture Ideas)  సంబంధించి బిజినెస్ (Business Ideas)  చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఒకవేళ మీరు కూడా సొంతంగా వ్యాపారం చేయాలని భావిస్తుంటే.. అందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ఇవాళ ఓ పంట గురించి తెలుసుకుందాం. ఇది తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇస్తుంది. నెలల వ్యవధిలోనే లక్షలు సంపాదించవచ్చు. రెస్టారెంట్లలో వీటిని అధికంగా వినియోగిస్తారు. దోసకాయలతో సలాడ్‌లు చేస్తుంటారు.

Business Idea: ఈ వ్యాపారానికి పెట్టుబడి కేవలం రూ.10 వేలే.. కానీ, నెలకు రూ.లక్ష ఆదాయం.. ఓ లుక్కేయండి

దోసకాయలు (Cucumber Farming) నీరు పుష్కలంగా ఉన్న ఇసుక, లోమీ నేలల్లో బాగా పండుతుంది. నేల pH విలువ 6-7 మధ్య ఉండాలి. అధిక ఉష్ణోగ్రతలో సాగు చేస్తే దిగుబడి ఎక్కువగా ఉంటుంది. నదులు, చెరువుల పక్కన ఉండే భూముల్లో పండించవచ్చు. ఈ పంటను గ్రామాలతో పాటు నగరాల్లో కూడా సాగు చేయవచ్చు. దోస పంట సాగుకు ప్రభుత్వాలు సైతం సాయం చేస్తాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోరమైన విధానం ఉంటుంది. మీ సమీపంలోని వ్యవసాయ కేంద్రానికి వెళ్తే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. దోసకాయ పంట కేవలం 60 నుంచి 80 రోజుల్లోచే చేతికి వస్తుంది. ఆ తర్వాత దోసకాయలను కోసి మార్కెట్లో విక్రయించవచ్చు.

నేటి నుంచి ఈ బ్యాంక్ కనిపించదు.. కస్టమర్లు గుర్తించుకోవాల్సిన 10 అంశాలివే

 ఉత్తరప్రదేశ్‌కు చెందిన దుర్గాప్రసాద్ అనే రైతు దోసకాయ సాగుతో లక్షల ఆదాయం పొందుతున్నాడు. కేవలం 4 నెలల్లో రూ. 8 లక్షలు సంపాదించాడు. దుర్గా ప్రసాదర్ నెదర్లాండ్స్ నుంచి ప్రత్యేక రకమైన కీరదోస విత్తనాలను తీసుకొచ్చాడు. ఇందులో విత్తనాలు ఉండవు. అందువల్ల హోటల్స్, రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లు అధికంగా వస్తున్నాయి. నేరుగా వాటికి విక్రయిస్తూ అధిక లాభాలు పొందుతున్నాడు దుర్గాప్రసాద్.

ఇది తక్కువ ఖర్చుతో అధిక దిగుబడినిచ్చే పంట. సగటున ఎకరాకు రూ.50 వేలు ఖర్చు చేస్తే.. సుమారు 70 క్వింటాళ్ల దోసకాయ పంట చేతికి వస్తుంది. మండీలలో దీని ధర క్వింటాల్‌కు 1000 నుండి 2000 రూపాయల వరకు ఉంటుంది. క్వింటాల్‌కు సగటున రూ.1500 ధర పలికినా ఎకరాకు రూ.లక్షకుపైగానే వస్తుంది. తద్వారా ఎకరాకు రూ.50వేల నికర లాభం వస్తుంది. ఎక్కువ భూమిలోసాగు చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. సూపర్ మార్కెట్లు, హోటల్స్‌, రెస్టారెంట్స్‌తో మాట్లాడి ఒప్పందం చేసుకుంటే.. మరింత ఆదాయం వస్తుంది.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

First published:

Tags: Agriculture, Business Ideas, Farmers, Local News

ఉత్తమ కథలు