హోమ్ /వార్తలు /తెలంగాణ /

BRS MLAs Poaching Case: తెలంగాణ సర్కార్ కు బిగ్ షాక్..!

BRS MLAs Poaching Case: తెలంగాణ సర్కార్ కు బిగ్ షాక్..!

తెలంగాణ సర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్!

తెలంగాణ సర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్!

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. సింగిల్ బెంచ్ తీర్పును సమర్ధించిన హైకోర్టు (High Court) సీబీఐ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా సింగిల్ బెంచ్ గతంలో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ తీర్పును ప్రభుత్వం హైకోర్టు (High Court) లో సవాల్ చేసింది. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పిటీషన్ ను కొట్టివేసింది. ఈ కేసు సీబీఐ (CBI)కి వెళ్తుందా లేక సిట్ కు అప్పగిస్తారా అనే ఉత్కంఠ హైకోర్టు తీర్పుతో వీడింది. కాగా హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Telangana Budget 2023-24: బడ్జెట్ లో దళితబంధు సహా ఇతర పథకాలకు కేటాయింపులు ఇలా..

ఎమ్మెల్యేల కొనుగోలు (MLAa Poaching Case) కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. మొదట ఈ కేసును సిట్ (Special Investigation Team) దర్యాప్తు చేసింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో సీబీఐ (Central Burew Of Investigation) కి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే సీబీఐ  (Central Burew Of Investigation) విచారణ అవసరం లేదని ప్రభుత్వం సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ అప్పీల్ పై విచారణ జరిపిన కోర్టు నేడు కీలక తీర్పు వెల్లడించింది.

Telangana Budget 2023-24 Live Updates: రూ. 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌.. ఏ రంగానికి ఎంత కేటాయించారంటే..

ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగించాలన్న తీర్పును సవాల్ చేస్తూ..సర్కార్ దాఖలు చేసిన పిటీషన్ పై జనవరి 6న కోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వివరాలు కోరుతూ సీఎస్ కు లేఖ రాశామని హైకోర్టుకు సీబీఐ  (Central Burew of Investigation) పేర్కొంది. సిట్ మాకు ఎలాంటి డాకుమెంట్స్ ఇవ్వలేదు. ఇస్తే దర్యాప్తు చేస్తామని సీబీఐ తెలపగా..హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఆగాలని కోర్టు సీబీఐ (Central Burew of Investigation)కి సూచించింది.  సిబిఐ వాదన కూడా వింటామని హైకోర్టు పేర్కొంది. ఈ కేసు సిట్ నుండి సీబీఐకి అప్పగించడానికి మొత్తం 45 కారణాలను కోర్టు పేర్కొంది.

ఈ కేసుకు సంబంధించి బీజేపీ తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు. బీజేపీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చలేదు. అలాగే ఒక్క ఎమ్మెల్యేను కానీ కొనుగోలు చేయలేదు. 2014 నుంచి 37 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని దామోదర్ రెడ్డి వాదించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేరాలని కేసీఆర్ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారని దామోదర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

సప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం?

కాగా హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి మరింత సమయం కావాలని ఏజీ కోర్టును కోరినట్లు తెలుస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు ఆర్డర్ ను సస్పెన్షన్ లో పెట్టాలని ఏజి కోరారు. కానీ ఆర్డర్ సస్పెన్షన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది.

First published:

Tags: BRS, Telangana, Telangana High Court, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు