హోమ్ /వార్తలు /తెలంగాణ /

హైదరాబాద్ చెన్నై విమానంలో బాంబు.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్..!

హైదరాబాద్ చెన్నై విమానంలో బాంబు.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌లతో క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయంలో ఇప్పటి వరకు ఎలాంటి బాంబును, అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదని అధికారులు తెలిపారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన బెదిరింపు కాల్ కలకలం రేపింది.   శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈరోజు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్ - చెన్నై విమానంలో బాంబు పెట్టామంటూ ఓ దుండగుడు ఫోన్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలను నిర్వహించారు.

తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదని అధికారులు తెలిపారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌లతో క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయంలో ఇప్పటి వరకు ఎలాంటి బాంబును, అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదని అధికారులు తెలిపారు.

మరోవైపు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎయిర్ పోర్టులోనే ఉన్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. చెన్నైలో సీనియర్ ఇంజినీర్ గా పని చేస్తున్న అజ్మీరా భద్రయ్య అనే వ్యక్తి ఈ కాల్ చేసినట్టు గుర్తించారు. విమానాశ్రయానికి ఆయన లేట్ గా రావడంతో ఆయనను ఎయిర్ లైన్స్ సిబ్బంది అనుమతించలేదు. దీంతో, ఆయన ఈ బెదిరింపు కాల్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

First published:

Tags: Hyderabad, Local News, Shamshabad Airport

ఉత్తమ కథలు