హోమ్ /వార్తలు /తెలంగాణ /

విద్యాసంస్థలకు 31 వరకు సెలవులు... టీవీ9 పేరుతో తప్పుడు ప్రచారం

విద్యాసంస్థలకు 31 వరకు సెలవులు... టీవీ9 పేరుతో తప్పుడు ప్రచారం

మార్ఫింగ్ చేసిన టీవీ9 బ్రేకింగ్ ప్లేట్

మార్ఫింగ్ చేసిన టీవీ9 బ్రేకింగ్ ప్లేట్

ఆర్టీసీ సమ్మె కారణంగా సెలవులను ఈ నెల 31 వరకు పొడిగించిందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. టీవీ9 బ్రేకింగ్ ప్లేట్‌ను మార్పింగ్ చేసి కొందరు సోషల్ మీడియాలో ఈ రకమైన ప్రచారం చేపట్టారు.

తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం మరిన్ని రోజులు సెలవులు ప్రకటించిందని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా సెలవులను ఈ నెల 31 వరకు పొడిగించిందనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. టీవీ9 బ్రేకింగ్ ప్లేట్‌ను మార్పింగ్ చేసి కొందరు సోషల్ మీడియాలో ఈ రకమైన ప్రచారం చేపట్టారు. అయితే దీనిపై టీవీ9 యాజమాన్యం స్పందించింది. కొందరు తమ పేరుతో కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని... వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఆర్టీసీ సమ్మె కారణంగా దసరా సెలవులను ఈ నెల 19 వరకు ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నెల 21న తెలంగాణలోని విద్యాసంస్థలు పున: ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో కొందరు మరోసారి తెలంగాణ ప్రభుత్వం సెలవులను పొడిగించిన ప్రచారం మొదలుపెట్టారు.

First published:

Tags: CM KCR, Telangana, Tsrtc, TSRTC Strike, TV9