హోమ్ /వార్తలు /telangana /

Telangana : పొంగల్ వేడుకల్లో గవర్నర్ , కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు.

Telangana : పొంగల్ వేడుకల్లో గవర్నర్ , కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు.

Telangana : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు, త తమిళనాడులో పొంగల్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన కుటుంబ సభ్యులతో పొంగల్ వేడుకులను జరుపుకున్నారు. మరోవైపు సీఎం కేసిఆర్ తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Telangana : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు, త తమిళనాడులో పొంగల్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన కుటుంబ సభ్యులతో పొంగల్ వేడుకులను జరుపుకున్నారు. మరోవైపు సీఎం కేసిఆర్ తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Telangana : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు, త తమిళనాడులో పొంగల్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన కుటుంబ సభ్యులతో పొంగల్ వేడుకులను జరుపుకున్నారు. మరోవైపు సీఎం కేసిఆర్ తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

ఇంకా చదవండి ...

    రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు, త తమిళనాడులో పొంగల్ ఉత్సవాలు ఘనంగా

    నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలోనే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన కుటుంబ సభ్యులతో పొంగల్ వేడుకులను జరుపుకున్నారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వేడుకులను జరుపుకోవాలని ఆమె సూచించారు.

    మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని.. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

    స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని, పంటపెట్టుబడి సాయం, పలు రైతు సంక్షేమ పథకాలు, పటిష్ట చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నిత్య సంక్రాంతిని నెలకొల్పిందని సిఎం అన్నారు.  దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో వ్యవసాయం అనుబంధ రంగాలలో పండుగ వాతావరణం నెలకొల్పామన్నారు. తెలంగాణ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎన్ని కష్టాలెదురైనా సమర్థవంతంగా ఎదుర్కుంటామని, రైతుల జీవితాల్లో నిత్య సంక్రాంతులను కొనసాగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ, సంక్రాంతి పండుగను పచ్చదనం నడుమ ఆనందంగా జరుపుకోవాలని సిఎం కెసిఆర్ కోరారు.

    First published:

    ఉత్తమ కథలు