హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: అయ్యో పాపం..ఎంత కష్టమొచ్చిందో..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్..హైదరాబాద్ లో విషాదం

Hyderabad: అయ్యో పాపం..ఎంత కష్టమొచ్చిందో..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్..హైదరాబాద్ లో విషాదం

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్

ప్రస్తుతం రోజులు మారిపోయాయి. చిన్న చిన్న కారణాలకే నిండు జీవితాన్ని అర్ధాంతరంగా బలి చేసుకుంటున్నారు. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, మార్కులు రాలేదని, ఉద్యోగం రాలేదని, ఆర్ధిక సమస్యలు వంటి కారణాలతో తనువు చాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం రోజులు మారిపోయాయి. చిన్న చిన్న కారణాలకే నిండు జీవితాన్ని అర్ధాంతరంగా బలి చేసుకుంటున్నారు. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, మార్కులు రాలేదని, ఉద్యోగం రాలేదని, ఆర్ధిక సమస్యలు వంటి కారణాలతో తనువు చాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చందానగర్ లోని పాపిరెడ్డి కాలనీకి చెందిన ఓ కుటుంబంలోని నలుగురు సూసైడ్ (Suicide) చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

TSPSC Group 1 Key And Results Dates: అభ్యర్థులకు అలర్ట్.. ప్రాథమిక కీ విడుదల ఆ రోజే.. కేటగిరీల వారీగా కట్ ఆఫ్ ఇలా..

రాజీవ్ గృహకల్ప బ్లాక్ నెంబర్ 18లో నివాసం ఉంటున్న కుటుంబానికి చెందిన భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే వీరు శుక్రవారం నుంచి ఇంట్లో నుండి బయటకు రాలేదు. దీనితో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు పగలగొట్టి చూడగా నలుగురు విగతజీవులుగా పడి ఉన్నారు. వారి మృతదేహాలు కుళ్లిపోయే స్థితికి వచ్చాయి. మృతులు నాగరాజు (Nagaraju), ఆయన భార్య సుజాత (Sujatha), పిల్లలు రమ్యశ్రీ, టిల్లులుగా తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు.

Hawala money: హైదరాబాద్‌లో మరో 2కోట్ల రూపాయల హవాలా మనీ సీజ్ .. వారం రోజుల్లో పట్టుబడిన డబ్బెంతో తెలుసా..?

 వీరంతా గత 7 సంవత్సరాల నుండి ఇక్కడే నివసిస్తున్నట్లు తెలుస్తుంది. మొదట భార్య పిల్లలను చంపిన నాగరాజు ఆపై తాను కూడా బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే వీరి ఆత్మహత్యకు ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే కారణం అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతులను పోస్ట్ మార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చందానగర్ (Chandanagar) పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరు నిజంగానే ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

రాష్ట్ర రాజధానిలో హత్యలు, ఆత్మహత్యలు నిత్యకృత్యంగా మారాయి.  చిన్న చిన్న వివాదాలు, ఆర్ధిక సమస్యలతో నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం వందేళ్ల జీవితాన్ని బుగ్గిపాలు చేసింది. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. ప్రతీదానికి చావే కారణం కాదు. చనిపోయి సాధించేది ఏమి లేదు. బ్రతికి సమస్యలను పరిష్కరించుకోవాలి. అప్పటివరకు భార్య, భర్త పిల్లలతో హాయిగా బ్రతికిన ఆ కుటుంబంలో ఇప్పుడు పెను విషాదం మిగిలింది.

First published:

Tags: Crime news, Family suicide, Telangana

ఉత్తమ కథలు