సూర్యాపేట జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ సమీపంలోని ఖమ్మం క్రాస్రోడ్డు వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను సిమెంట్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్టు సమాచారం. వీరంతా తమ్మర పట్టణంలో శ్రీరామ నవమి వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.ప్రమాద సమయంలో మొత్తం 9మంది ప్రయాణికులు ఆటోలో ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను కోదాడలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించినట్టు తెలుస్తోంది. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారైనట్టు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇటీవలి కాలంలో నల్గొండ మార్గంలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటంపై ఇక్కడి ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nalgonda, Road Accident, Telangana