హోమ్ /వార్తలు /తెలంగాణ /

TRS MLAs Poaching Case: ఫామ్ హౌస్ డీల్ కేసు..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

TRS MLAs Poaching Case: ఫామ్ హౌస్ డీల్ కేసు..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రామచంద్రభారతి బెయిల్ పిటీషన్ ను కొట్టేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ దశలో ఉన్న ఈ కేసులో జోక్యం చేసుకోలేమని సుప్రీం అభిప్రాయపడింది. అయితే పిటీషనర్ హైకోర్టును ఆశ్రయించే హక్కు ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై నేడు సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరిగింది. రిమాండ్ ను సవాల్ చేస్తూ రామచంద్రభారతి వేసిన పిటీషన్ ను కొట్టేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ దశలో ఉన్న ఈ కేసులో జోక్యం చేసుకోలేమని సుప్రీం (Supreme Court) అభిప్రాయపడింది. అయితే పిటీషనర్ హైకోర్టు (High court)ను ఆశ్రయించే హక్కు ఉందని సుప్రీంకోర్టు (Supreme Court) పేర్కొంది. అలాగే హైకోర్టు  (High court) తీర్పుపై సుప్రీం (Supreme Court) అభ్యంతరం వ్యక్తం చేసింది.

Chiranjeevi: మా తమ్ముడు సీఎం అవడం ఖాయం .. పవన్ కల్యాణ్‌ పొలిటికల్ సైలెంట్‌ని బ్రేక్ చేసిన చిరంజీవి

కేరళలో సోదాలు..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సిట్ బృందం కేరళ (Kerala) వెళ్లిన విషయం తెలిసిందే. కేరళ (Kerala)లో విచారణ పూర్తి చేసుకున్న సిట్ బృందం హైదరాబాద్ కు చేరుకున్నారు. దాదాపు 5 రోజుల పాటు సిట్ బృందం కేరళలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కేరళ (Kerala)లో డాక్టర్ జగ్గుజీస్వామి కోసం సిట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ సిట్ బృందం కేరళ (Kerala)కు వస్తుందన్న విషయం తెలుసుకున్న జగ్గుజి అనే డాక్టర్ పారిపోయాడు.

Tollywood: చిరంజీవికి అవార్డు దక్కడంపై పవన్ కల్యాణ్ రియాక్షన్ .. అన్నయ్య కీర్తి కిరీటంలో ఇదొక వజ్రం

ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలన్న బీజేపీ దాఖలు చేసిన పిటీషన్ పై ఇటీవల తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ చేపట్టింది. కేసు దర్యాప్తుకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు (Telangana High Court) ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి నిరాకరించింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగించాలని కొన్ని కండీషన్స్ పెట్టింది కోర్టు. ఈ కేసును సిట్ చీఫ్ సీవీ ఆనంద్ నేతృత్వంలో దర్యాప్తు చేయాలి.

అలాగే దర్యాప్తుకు సంబంధించి ఎలాంటి విషయాలను అటు మీడియా, ఇటు రాజకీయ నాయకులకు వెల్లడించవద్దని హైకోర్టు తెలిపింది. దర్యాప్తుకు సంబంధించి పురోగతి నివేదికను ఈనెల 29న హైకోర్టు (Telangana High Court) ముందు ఉంచాలని కోర్ట్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే నేడు విచారణకు హాజరు కావాలని శ్రీనివాస్, సంతోష్, తుషార్, జగ్గూజికి సిట్ నోటీసులు పంపించింది. కానీ విచారణకు కేవలం శ్రీనివాస్ మాత్రమే హాజరు అయినట్లు తెలుస్తుంది. మరి మిగతా వారి గైర్హాజరుపై సిట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.

First published:

Tags: Supreme, Supreme Court, Trs, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు