హోమ్ /వార్తలు /తెలంగాణ /

బ్రేకింగ్ న్యూస్: ఫామ్ హౌస్ డీల్ కేసు..నిందితులకు ఏసీబీ కోర్టులో భారీ షాక్

బ్రేకింగ్ న్యూస్: ఫామ్ హౌస్ డీల్ కేసు..నిందితులకు ఏసీబీ కోర్టులో భారీ షాక్

ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టులో భారీ షాక్

ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టులో భారీ షాక్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు అయింది. నిందితులు రామచంద్రభారతి (Ramachandra Bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji)లకు బెయిల్ పిటీషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఒకవేళ నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ కు నిరాకరించింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు అయింది. నిందితులు రామచంద్రభారతి (Ramachandra Bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji)లకు బెయిల్ పిటీషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఒకవేళ నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ కు నిరాకరించింది.

Ys Sharmila: టీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగిన YS షర్మిల..కేసీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్

ఇక ఫామ్ హౌజ్ డీల్ కేసుకు సంబంధించి మరో ఇద్దరు శరత్, ప్రశాంత్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వీరిద్దరూ కీలకం కానున్నట్లు తెలుస్తుంది. శరత్, ప్రశాంత్ ను అదుపులోకి తీసుకొని అక్కడే పోలీసు కమిషనరేట్ లో తెలంగాణ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అలాగే కొచ్చిన్ కు చెందిన జగ్గూజి అనే మరో స్వామిజి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తుషార్ కు, జగ్గూజికి మధ్య సంబంధాలపై, అలాగే ఆర్ధిక లావాదేవీలపై పోలీసులు కూపీ లాగుతున్నారు.  ఇప్పటికే నిందితుల్లో ఒకరైన నందకుమార్ (Nandakumar) హోటల్ ను జేసీబీలతో కూల్చివేశారు. ఫిల్మ్ నగర్ లోని డెక్కన్ కిచెన్ హోటల్ ను భారీ పోలీసు బందోబస్తు మధ్య హోటల్ ను నేలమట్టం చేశారు. ఓ వైపు హోటల్ కూల్చివేస్తూనే మరోవైపు సిట్ అధికారులు ఏపీ, హర్యానా , కేరళ , కర్ణాటకతో పాటు హైదరాబాద్ (Hyderabad) లో సోదాలు జరిపారు. హైదరాబాద్ లో నందకుమార్  (Nandakumar) ఇళ్లలో సోదాలు చేపట్టగా..తిరుపతిలోని సింహయాజి (Simhayaji) ఆశ్రమంలో సిట్ తనిఖీలు చేశారు. ఇక హర్యానా, కర్ణాటకలో రామ చంద్ర భారతి (Rama chandra bharathi) ఇళ్లలోనూ రైడ్స్ జరిగాయి. అలాగే కేరళలో ఓ డాక్టర్ ఇంట్లో కూడా సోదాలు చేపట్టారు. ఈ డాక్టర్ రామచంద్రభారతికి మధ్యవర్తిత్వంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం డాక్టర్ కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ కేసులో A2 గా ఉన్న నందకుమార్ (Nandakumar) డెక్కన్ కిచెన్ హోటల్ ను భారీ పోలీసు బందోబస్తు మధ్య హోటల్ ను నేలమట్టం చేశారు. ఓ వైపు హోటల్ కూల్చివేస్తూనే మరోవైపు సిట్ అధికారులు ఏపీ, హర్యానా, కేరళ, కర్ణాటకతో పాటు హైదరాబాద్ (Hyderabad) లో సోదాలు జరిపారు.  అయితే ఈ సోదాల్లో వారికీ కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కేరళలో ఇంకా రైడ్స్ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.

First published:

Tags: Supreme Court, Telangana, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు