హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ganesh Bhavan: తెలంగాణలో వినాయకుడికి తొలి గణేశ్​ భవన్​.. పూర్తి వివరాలివే

Ganesh Bhavan: తెలంగాణలో వినాయకుడికి తొలి గణేశ్​ భవన్​.. పూర్తి వివరాలివే

గణేశ్​ భవన్​ను ప్రారంభిస్తున్న మంత్రి

గణేశ్​ భవన్​ను ప్రారంభిస్తున్న మంత్రి

రాష్ట్రంలోనే తొలిసారిగా రూ. 30 లక్షల నిధులతో నిర్మించిన గణేష్ భవన్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Mahbubnagar, India

తెలంగాణలో (Telangana) తొలిసారిగా రూ. 30 లక్షల నిధులతో నిర్మించిన గణేష్ భవన్‌ను (Ganesh Bhavan) ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్ సమీపంలో భవన్​ నిర్మించారు. అనంతరం గణేష్ భవన్‌లో ప్రతిష్టించిన బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేశారు.  తొలి గణేష్ భవన్ మహబూబ్ నగర్ లో ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గణేష్ ఉత్సవ సమితి తరఫున పద్మశాలి భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో గణేష్ భవన్ నిర్మించాలని అనుకున్నామని... ఆ మేరకు కార్యాచరణ చేపట్టి భవనం నిర్మించుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈనెల తొమ్మిదవ తేదీన సమావేశం ఏర్పాటు చేసుకొని వినాయక చవితి నాటికి గణేష్ భవన్ నిర్మించాలని కార్యాచరణ సిద్ధం చేసుకోగా కేవలం 20 రోజుల వ్యవధిలో నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్సవాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. గణేష్ భవన్ పూర్తిస్థాయి పనులు చేపట్టేందుకు అవసరమైన నిధులను అందజేస్తామని వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని వర్గాల కోసం ఆధ్యాత్మిక భవనాలు నిర్మించడంలో కృషి కృషి చేస్తోందని అన్నారు. గణేష్ భవన్ వేగంగా నిర్మితమయ్యేందుకు కారణమైన అధికారులు, ఇంజనీర్లు, మేస్త్రిని మంత్రి అభినందించారు. వినాయక చవితి సమయంలోనే కాకుండా మిగతా సమయాల్లోనూ గణేష్ భవన్ ను సద్వినియోగం చేసుకోవాలని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు.



మంత్రితో పాటు మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బుచ్చారెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్య యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్, ముడా డైరెక్టర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలను (Ganesh Chaturthi 2022) ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) మరో కార్యక్రమంలో చెప్పారు. దారి పొడవునా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో లైట్లను ఏర్పాటు చేయడం, క్రిందకు ఉన్న విద్యుత్ తీగలను తొలగించడం జరుగుతుందని తెలిపారు. విద్యుత్ సరఫరా లో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ముందు జాగ్రత్త లు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. లక్షలాదిమంది రానున్నందున వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి త్రాగునీటిని అందుబాటులో ఉంచుతారని అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రౌండ్ ది క్లాక్ పద్దతి లో GHMC పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు.

First published:

Tags: Ganesh Chaturthi​ 2022, Mahbubnagar, Srinivas goud

ఉత్తమ కథలు