తెలంగాణ-ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు హతమైనట్టు తెలుస్తోంది. మరోవైపు ఎన్కౌంటర్ కొనసాగుతున్న నేపథ్యంలోనే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా ఈ ఘటన ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం కర్రెగుట్టల సమీపంలో ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. కాగా ఈ పోలీసులు కూంబీంగ్ చేస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
కాగా గత మూడు నెలల క్రితం కూడా ములుగు జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. టేకులగూడెం – చత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతంలో..... పోలీసులు – మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
ఇక ఇటివల ఏటూరునాగారంలో ఓ మాజీ సర్పంచ్ను మావోయిస్టులు కాల్చి చంపారు. పోలీస్ ఇన్ఫార్మర్ అంటూ కిడ్నాప్ చేసిన మావోలు కిడ్నాప్ తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే హతమార్చారు.
కాగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో నేడు మంత్రుల పర్యటన కొనసాగుతోంది. వర్షాలకు నష్టపోయిన పంటలను పరీశీలించడంతో పాటు రైతులకు భరోసా కల్పించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.