హైదరాబాద్ మెట్రో రైలులో మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తాయి.ఇవాళ ఉదయం 10:30 గంటలకు ప్యారడైజ్ వద్ద మెట్రోరైలు ఆగిపోయింది. దీంతో అధికారులు వెంటనే మరమ్మత్తు చర్యలు చేపట్టారు.ఆగిన మెట్రో రైలును ... మరో రైలు ద్వారా తరలించారు. మరమ్మత్తు చేసినప్పటికీ కదలకపోవడంతో వేరే ట్రైన్ ని రప్పించి ఈ ట్రైన్ కి జాయింట్ చేసి అమీర్పేట్ మెట్రో జంక్షన్ వరకు అధికారులు తీసుకెళ్లారు. దీంతో ఆ మెట్రో రైలులో ప్రయాణికుల్ని దించి మరో రైలులో గమ్యస్థానాలకు చేరవేశారు. విద్యుత్ సమస్య వల్లే మెట్రో రైలు ఆగిందని అధికారులు చెబుతున్నారు. నాగోల్ - హైటెక్ సిటీ వెళ్తుండగా ఈ సమస్య తలెత్తింది. అయితే ఇప్పటికే బస్సులు లేక ఇబ్బందిపడుతున్న ప్రయాణికులు... ఇటు మెట్రో రైలు కూడా మొరాయించడంతో ఇబ్బందులు పడ్డారు. ఆఫీసులకు వెళ్లేవారు అసహనం వ్యక్తంచేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.