CV Anand : డ్రగ్స్పై రూటు మార్చిన పోలీసులు.. ఇక వినియోగదారులపై ఫోకస్.. కారణం ఇదే..
CV-Anand
CV Anand : డ్రగ్స్ వినియోగదారులపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుండి డ్రగ్స్ వినియోగించే వారిపై ఉపేక్షించమని హెచ్చరించారు. వారిని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హైదరాబాద్ నగర పోలీసులకు సవాల్ విసిరిన డ్రగ్స్తో పాటు గంజాయి మాఫియా పై గత కొద్ది కాలంగా ఉక్కుపాదం పాదం మోపుతున్న విషయం తెలిసిందే.. అయితే పోలీసులు డ్రగ్స్ మాఫియాను పట్టుకోవడం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని జైలుకు పంపడడం లాంటి చర్యలు చేపడుతూ కంట్రోల్లోకి తీసుకువస్తున్నారు.. ముఖ్యంగా గంజాయి అమ్మకాల సరఫరాను కనుగొని వారిపై ఉక్కుపాదం మోపారు.అయితే ఇది భారత దేశంలోని కొన్ని రాష్ట్రాల నుండే సరఫరా అవుతుండడంతో పెద్ద ఎత్తున దాడులు చేసి గంజాయి సాగును ధ్వంసం చేశారు. దీంతో ఇటివల గంజాయి సప్లై తగ్గిపోయింది.
కాని, డ్రగ్స్ సప్లై దారుల మాఫియాకు అంతర్జాతీయంగా సంబంధాలు ఉండడం, విదేశాల నుండి డ్రగ్స్ సరఫరా అవుతుంటుంది.. దీనిపై ఎంత కట్రోల్ చేసినా.. కోత్త మాఫియా పుట్టుకు వస్తూనే ఉంటుంది. ఇలా వారిపై ఎన్ని కేసులు పెట్టినా.. ప్రయోజనం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలు డ్రగ్స్ అమ్మకమే కాదు.. దాన్ని వినియోగించే వారిని ఈసారి టార్గెట్ చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా డిమాండ్ లేకుండా డ్రగ్స్ సప్లై ఉండదనే సూత్రంతో ముందుకు సాగేందుకు నిర్ణయించారు. కాగా ఇన్నాళ్లు డ్రగ్స్ అమ్మెవారిపై చర్యలు తీసుకుంటున్న పోలీసులు అవి వినియోగిస్తున్న విద్యార్థులు, యువకులను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. అయితే ఇదే అదనుగా తీసుకుంటున్న డ్రగ్ వినియోగ దారులు వాటిని అమ్మెందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.. అలవాటు కాస్తా స్మగ్లర్లుగా మారుస్తుందనే అభిప్రాయానికి వచ్చారు.
దీంతో డ్రగ్స్ వాడుతున్న యువకులు, విద్యార్థులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్దమయ్యారు. వారి భవిష్యత్ పై ఇక ఆలోచన లేకుండా చట్టపరమైన కేసులు పెట్టాలని నిర్ణయించారు. డ్రగ్స్ మాఫియా ద్వారా కొనుగోలు చేస్తున్న వారిని కూడా కటకటాలపాలు ( 27 సెక్షన్ ) చేయాలని నిర్ణయించారు. ముందుగా వినియోగదారులను కట్ చేస్తే సప్లై దారులు వెనక్కి తగ్గుతారనే నమ్మకంతో ఈ చర్యలకు శ్రీకారం చుట్టినట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
కాగా తాజా ఇలా నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న మూడు గ్యాంగ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 20 లక్షల రూపాయల డ్రగ్స్ను పట్టుకున్నట్టు తెలిపారు. పట్టుకున్న గ్యాంగ్లు రెండు ముంబయికి చెందిన వారు కాగా మరొకరు హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. కాగా ఈ డ్రగ్స్ ఆపరేషన్ అంతా ముంబాయిలో ఉంటున్న నైజీరీయన్ సూత్రదారులుగా డ్రగ్స్ మాఫియా కొనసాగుతున్నట్టు ఆయన తెలిపారు. అయితే అసలు సూత్రదారి తప్పించుకు తిరుగుతున్నాడని, దీంతో ఆయన అనుచరులను పట్టుకున్నట్టు ఆయన తెలిపారు. కాగా మూడు వేలకు తీసుకువచ్చి ఎనిమిది వేలకు అమ్ముతున్నట్టు ఆయన తెలిపారు.
విద్యార్థుల జీవితాలను ఎందుకు నాశనం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇన్నాళ్లు డ్రగ్స్ వాడుతున్న వారిపై చట్టపరమైన చర్య ఇక ఉపేక్షించేది లేదని సీపీ ఆనంద్ స్పష్టం చేశారు.. ఈ క్రమంలోనే వారిపై కొరఢా ఝలిపించడం ఖాయమని ఆయన హెచ్చరించారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.