రాజన్న సిరిసిల్ల జిల్లా.
న్యూస్ 18.తెలుగు కరస్పాండెంట్. శ్రీనివాస్. పి.
నేను చనిపోతే . . . మీరంతా హాయిగా బతుకుతారా . . . నాకంటుకున్న రోగం . . . మీ అందరికి ఎందుకు అంటుకోకూడదు . . . అనుకుందో ఏమో, బలవంతంగా కోడలిని, పిల్లల్ని అలింగనం చేసుకుని కొడలికి కోవిడ్ పాజిటివ్ రాగానే బయటకు గెంటి వేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా లో చోటు చేసుకుంది.
ఓ అత్త తనకు కరోనా వచ్చిందని కోడలికి కూడా అంటించింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు గెంటేసింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారిపేట పరిధిలోని నెమిలిగుట్ట తండా వాసితో మూడేళ్ల క్రితం పెళ్లైంది. ఆమెకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. భర్త ఉపాధి కోసం 7 నెలల క్రితం ఒడిశా వెళ్లాడు. అక్కడే ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అయితే ఐదు రోజుల క్రితం ఆమె అత్త కరోనా బారిన పడింది. దీంతో అత్త హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతోంది. కోడలు వ్యక్తిగత దూరం పాటించడాన్ని అత్త జీర్ణించుకోలేకపోయింది, తన శాడిజం చూపించింది.
'నేను చనిపోతే మీరు హాయిగా బతుకుతారా' అంటూ కోడలిపై ద్వేషం పెంచుకుంది. కోడలిని తరచూ ఆలింగనం చేసుకుంది. అంతేకాదు ఆమె పిల్లలను కూడా బలవంతంగా దగ్గరికి తీసుకోవడం చేసింది. దీంతో కోడలు సైతం కరోనా బారిన పడింది. అనంతరం, చిన్న పిల్లలు ఉన్నారనే కనికరం కూడా చూడకుండా ఆమెను బయటకు నెట్టేశారు.
ఈ విషయం తెలుకున్న బాధితురాలి సోదరి రాచర్ల గొల్లపల్లిలోని తన సొంతింటికి తీసుకొచ్చి హోం క్వారంటైన్లో ఉంచింది. తనకు కరోనా సోకడానికి అత్తే కారణం అని బాధితురాలు వాపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోడలి పట్ల దారుణంగా ప్రవర్తించిన అత్తమామల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాధితురాలి బంధువులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Karimnagar