తెలంగాణ అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో సీఎం కేసీఆర్ (Cm Kcr) మాటల తూటాలు పేల్చారు. తనకు దొరికిన సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ..ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇటీవల నూతన సచివాలయంపై బండి సంజయ్, ప్రగతిభవన్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. కూల్చేస్తుంటే ఊరుకుంటామా. ప్రజలు ఊరుకుంటారా. కాళ్లు చేతులు విరగ్గొట్టి కూచోబెడతారని వార్నింగ్ ఇచ్చారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేశారని ఆరోపించారు. దేశంలో ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన రూ.473 కోట్లు కూడా ఏపీకి ఇచ్చి అన్యాయం చేశారని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వాలని ఏడేళ్లుగా అడుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు తెస్తే తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు ఎందుకు వేయాలని కేసీఆర్ ప్రశ్నించారు.
అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా..
ఇక కేసీఆర్ ప్రసంగం అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపగా అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు. మొత్తం 7 రోజుల పాటు 56 గంటల 25 నిమిషాలు సమావేశాలు జరిగాయి. ఈనెల 6న తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, CM KCR, Mp revanthreddy, Telangana