సీఎం కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. మార్చి 28న ఆలయ పునప్రారంభం కానుండడంతో అందుకు
సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష సమావేశంలో సీఎం పాల్గొని అందుకు సంభంధించిన కార్యక్రమాలపై
చర్చించనున్నారు. కాగా యాదాద్రికి చేరుకున్న సీఎం ఏరియల్ వ్యూ ద్వారా ఆలయనిర్మాణాన్ని పరీశీలించారు. యాగం జరిగే స్థలంతో పాటు ఇతర అంశాలను పరిశీలించారు. ఆలయానికి చేరుకున్న అనంతరం చుట్టూ తిరుగుతూ పలు సూచనలు చేశారు.
కాగా మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణంతో పాటు సుదర్శన యాగం చేయనుండడంతో అందుకు
సంబంధించిన అంశాలపై ఆలయ పండితులు ఇతర అధికారులతో నేడు సాయంత్రం సమీక్ష
నిర్వహించనున్నారు. కాగా ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్యే గొంగిడి సునిత, మోత్కుపల్లి నర్సింహులు ఇతర స్థానిక నేతలు ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Yadadri temple