GHMC ఎన్నికలలో అనూహ్య ఫలితాలు సాధించి.. టీఆర్ఎస్ ను నిలువరించిన బీజేపీకి అగ్ర నాయకత్వం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియా ఎన్నికలలో కమలం పార్టీ అనూహ్యంగా 47 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. మేయర్ పీఠం గెలవకున్నా.. టీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చాటుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారని ఆయన కొనియాడారు.
ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారధ్యంలో, అభివృద్ధి లక్ష్యంగా సాగిస్తున్న బిజెపి రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బీజేపీ కార్యకర్తల కృషి మరువరాదని కొనియాడారు.
ప్రధానమంత్రి @narendramodi గారి సారధ్యంలో,అభివృద్ధి లక్ష్యంగా సాగిస్తున్న బిజెపి రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు.
GHMC ఎన్నికల అద్భుతమైన ప్రదర్శనకు @JPNadda గారికి & @bandisanjay_bjp కు అభినందనలు.@BJP4Telangana కార్యకర్తల యొక్క కృషిని అభినందిస్తున్నాను.
— Amit Shah (@AmitShah) December 4, 2020
బల్దియా ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు సాధించిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ స్పందిస్తూ.. ఇక నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా ఇవే ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయం గ్రేటర్ హైదరాబాద్ ప్రజల విజయమని అన్నారు. ఎన్నికల సందర్భంగా తమ పార్టీకి చెందిన కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని.. అయినా పట్టుదలగా పార్టీ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bandi sanjay, GHMC, GHMC Election Result, Hyderabad, Hyderabad - GHMC Elections 2020, JP Nadda, Pm modi