news18
Updated: December 4, 2020, 9:25 PM IST
అమిత్ షా (ఫైల్)
- News18
- Last Updated:
December 4, 2020, 9:25 PM IST
GHMC ఎన్నికలలో అనూహ్య ఫలితాలు సాధించి.. టీఆర్ఎస్ ను నిలువరించిన బీజేపీకి అగ్ర నాయకత్వం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియా ఎన్నికలలో కమలం పార్టీ అనూహ్యంగా 47 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. మేయర్ పీఠం గెలవకున్నా.. టీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చాటుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారని ఆయన కొనియాడారు.
ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారధ్యంలో, అభివృద్ధి లక్ష్యంగా సాగిస్తున్న బిజెపి రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బీజేపీ కార్యకర్తల కృషి మరువరాదని కొనియాడారు.
బల్దియా ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు సాధించిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ స్పందిస్తూ.. ఇక నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా ఇవే ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయం గ్రేటర్ హైదరాబాద్ ప్రజల విజయమని అన్నారు. ఎన్నికల సందర్భంగా తమ పార్టీకి చెందిన కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని.. అయినా పట్టుదలగా పార్టీ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Published by:
Srinivas Munigala
First published:
December 4, 2020, 9:25 PM IST