‘‘మా నౌకరీలు మాగ్గావాలె’’ నినాదంతో ఇవాళ హైదరాబాద్... ఇందిరాపార్క్ దగ్గర ‘‘నిరుద్యోగ మహా ధర్నా’’ చేయబోతోంది బీజేపీ. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)లో పేపర్ల లీకేజీ వ్యవహారం కేసుల పరంగానే కాకుండా.. రాజకీయంగానూ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన వ్యాఖ్యలకు చట్టపరంగా వివరణ ఇచ్చుకోవాల్సి రావడంతో... దీనిపై నిరుద్యోగుల నుంచి మద్దతు కూడగట్టేందుకు సిద్ధమయ్యారు.
ఈ మహా ధర్నా షెడ్యూల్ గమనిస్తే.. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహా ధర్నా జరగనుంది. ఇందులో నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. TSPSC పేపర్ లీకేజీ, మీడియా సంస్థలపై దాడులు, జర్నలిస్టుల అరెస్టుల వంటి అంశాలపై బుధవారం పార్టీ సమావేశంలో చర్చించిన బండి సంజయ్ .. ఈ మహా ధర్నా ప్లాన్ చేశారు.
. @BJP4Telangana ఆధ్వర్యంలో "నిరుద్యోగ మహాధర్నా" ????️ 25 మార్చ్ 2023, ఉ. 10 గం.ల నుంచి సా. 5 గం.ల వరకు ????ధర్నాచౌక్, ఇందిరాపార్క్, హైదరాబాద్ యువతను వంచిస్తున్న కేసీఆర్ సర్కార్ మెడలు వంచుదాం...! మన కొలువులు మనం సాధించుకుందాం...!! pic.twitter.com/FIhiiLHphJ
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 24, 2023
కలకలం రేపిన నోటీసులు :
పేపర్ లీక్ కేసును డీల్ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)... బండి సంజయ్కి నోటీసులు పంపడం రాజకీయ దుమారం రేపింది. మార్చి 24న సిట్ కార్యాలయానికి వచ్చి.. తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇవ్వాలని సిట్ అధికారులు కోరడంతో.. ఈ అంశాన్ని రాజకీయంగా ఎదుర్కొనేందుకు బీజేపీ ... మహా ధర్నాకు సిద్ధమైంది. ఈ మహా ధర్నా ఎలా జరుగుతుంది? ప్రశాంతంగా కొనసాగుతుందా లేక ఆందోళనలు అదుపు తప్పుతాయా అనేది పోలీసులకు ఒకింత టెన్షన్ తెప్పిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, Telangana, Telangana News, TSPSC