ప్రపంచ దేశాలు పాల్గొనే ఒలింపిక్స్, విశ్వానికి శాంతి సౌభ్రాతృత్వాలను విరజిమ్మే ఆటల సింగిడికి ప్రతిరూపంగా నిలుస్తాయని సీఎం అభివర్ణించారు. ఒలింపిక్స్ క్రీడల్లో విజయాలు సాధించి, స్వర్ణాలతో పాటు పలు పతకాలు గెలిచేలా భారత క్రీడాకారులకు శుభం జరగాలని సీఎం కోరుకున్నారు. భారతదేశ కీర్తి పతాకాన్ని విశ్వవేదికపై మరోసారి ఎగరేయాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
జపాన్ దేశం టోక్యోలో నేటి నుంచి ప్రారంభం కానున్న 32వ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు సీఎం శ్రీ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలు పాల్గొనే ఒలింపిక్స్, విశ్వానికి శాంతి సౌభ్రాతృత్వాలను విరజిమ్మే ఆటల సింగిడికి ప్రతిరూపంగా నిలుస్తాయని అభివర్ణించారు.
— Telangana CMO (@TelanganaCMO) July 23, 2021
ఒలింపిక్స్ క్రీడల్లో విజయాలు సాధించి, స్వర్ణాలతో పాటు పలు పతకాలు గెలిచేలా క్రీడాకారులకు శుభం జరగాలని సీఎం కోరుకున్నారు. భారత దేశ కీర్తి పతాకాన్ని విశ్వవేదికపై మరోసారి ఎగరేయాలని సీఎం ఆకాంక్షించారు.@Tokyo2020 #Tokyo2020
— Telangana CMO (@TelanganaCMO) July 23, 2021
Best wishes to all the Indian athletes at #Tokyo2020 from Shri @KTRTRS
Shri Rao lauds the hard work of all the Indian athletes & believes that they will keep the ?? high at #Olympics2020 #StrongerTogether #Cheer4India @MinisterKTR @IndianOlympians @BAI_Media @WeAreTeamIndia pic.twitter.com/AlQE2TEgje
— GoBadminton (@gobadminton) July 19, 2021
మరోవైపు మంత్రి, రాష్ట్ర బాడ్మింటన్ అసోసియోషన్ అధ్యక్షుడు కేటీఆర్ సైతం భారత కీర్తి పతాకాన్ని ఎగరవేయాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా బాడ్మింటన్ అథ్లెట్స్కు ఆయన ప్రత్యేకంగా శుభాభినందనలు తెలిపారు. దేశం నుండి మొత్తం 120 క్రిడాకారులు పాల్గొంటున్న క్రిడల్లో విజయాల కోసం భారతీయులు ఆసక్తికరంగా వేచిచూస్తున్నారని తెలిపారు. క్రీడల్లో విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటునాని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, KTR, Tokyo Olympics