హోమ్ /వార్తలు /తెలంగాణ /

Maoist: ప్రభుత్వం అందించే సదుపాయాలకు ఆకర్శితులై.. లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు..?

Maoist: ప్రభుత్వం అందించే సదుపాయాలకు ఆకర్శితులై.. లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Maoist: దంతెవాడ జిల్లా కిరండోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొట్రెం గ్రామానికి చెందిన 16 మంది మావోయిస్టులు దంతెవాడ జిల్లా ఏస్పీ అభిషేక్ పల్లవ ఎదుట లొంగి పోయారు. అయితే వీరు ఇలా లొంగి పోవటం మావోయిస్టు లకు ఒక ఎదురు దెబ్బ అనె చెప్ప వచ్చు.

ఇంకా చదవండి ...

(G.SrinivasaReddy,News18,Khammam)

దంతెవాడ జిల్లా కిరండోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొట్రెం గ్రామానికి చెందిన 16 మంది మావోయిస్టులు దంతెవాడ జిల్లా ఏస్పీ అభిషేక్ పల్లవ ఎదుట లొంగి పోయారు. అయితే వీరు ఇలా లొంగి పోవటం మావోయిస్టు లకు ఒక ఎదురు దెబ్బ అనె చెప్ప వచ్చు. ప్రస్తుతం మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యం లో ఇలా వీరు లొంగి పోవటం మావోయిస్టు లకు ఎంత మేర నష్టం జరుగుతుంది అనేది వేచి చూడాలి. వీళ్లు విధ్వంసకర సంఘటనలలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు , మావోయిస్టులు అడవిలో ఉండి సాధించేది ఏమి లేదని జన జీవన స్రవంతి లో కలిసి ప్రభుత్వాలు.. అందించే సదుపాయాలను అందిపుచ్చుకోవాలని అతడు ప్రచారం నిర్వహించాడు.

Shocking Incident: ఎంత పని చేశావమ్మా.. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఇలా జరిగేది కాదు కదా..


దాని కారణంగా 16 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు SP అభిషేక్ పల్లవ్. అంతక ముందు ఎంతో మంది మావోయిస్టులు లొంగిపోగా.. వాళ్లకు కూడా ఇలాంటి సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించాయని.. దాని ప్రకారంగానే ఇప్పుడు వీళ్లు కూడా లొంగిపోయారని తెలిపాడు. ఇదిలా ఉండగా.. మరో ఘటనలో.. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న బాలాఘాట్ జిల్లా లాంచీ పోలిస్ స్టేషన్ పరిధిలో కోరిక గ్రామ సమీపంలో రహదారి నిర్మాణంలో ఉన్న  రోడ్డు రోలర్ తో పాటు మరికొన్ని వాహనాలకు మావోయిస్టులు నిప్పంటించారు.

అతడికి 25 ఏళ్లు.. పెళ్లైన 7 రోజులకే ఉపాధి కోసం సిటీకి వెళ్లాడు.. 6 నెలల తర్వాత ఇంటికి వచ్చేసరికి అతడి భార్య..


ఆ ప్రదేశంలో బ్యానర్లు, కరపత్రాలను వదిలివెళ్లారు. ఇలా అక్కడ నుంచి వెళ్లిన వారిలో దాదాపు 40 మంది నక్సలైట్లు పాల్గొన్నట్టు సమాచారం. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూరు రోడ్డు నిర్మాణం చేపడుతున్న సాయి దత్త సంస్థకు చెందిన రోడ్డు రోలర్ ను మావోయిస్టులు దగ్ధం చేశారు. ఏటూరు నాగారం మధ్యలో సాయి దత్త కన్స్ట్రక్షన్ బీటీ రోడ్డు నర్మాణ పనులో ఉంది. బిటి రోడ్డు రోలింగ్ చేస్తన్న వాహనాన్ని సాయి దత్త కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులు రోడ్డు పక్కకు నిలిపారు.

Sadist Fathers: కన్న బిడ్డలపైనే కసాయి తండ్రుల కర్కశత్వం.. కాళ్లకు కరెంట్ షాక్ పెట్టి.. నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..


మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా రోలర్ని మావోయిస్టులు దగ్ధం చేసేందుకు నిప్పు అంటించారు. కానీ ఎంతకు కాలకపోవడంతో.. వదిలిపెట్టి వెళ్లారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు. మావోయిస్టుల జాడ కోసం పోలీసులు జల్లెడ పడుతున్న నేపథ్యంలో ఇలా మావోయిస్టులు వచ్చి రోడ్డు రోలర్ కు నిప్పు పెట్టి వెళ్లిపోయి.. పోలీసులకు సవాల్ విసిరారు.

First published:

Tags: Khammam, Maoist, Maoist attack

ఉత్తమ కథలు