దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAs Poaching Case)లో తెలంగాణ సర్కార్ (Telangana Government)కు వరుస షాకులు తగులుతున్నాయి. ఈ కేసు విచారణను సీబీఐ (Central Burew Of Investigation)కి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలో పిటీషన్ పై త్వరితగతిన విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)ను కోరింది. అయితే త్వరితగతిన ఈ అంశాన్ని విచారించడం సాధ్యం కాదు. ఈనెల 17న ఈ అంశంపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొంది. సాక్ష్యాలు సీబీఐ చేతికి వెళ్తే చేసేది ఏమి లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టు (Supreme Court)కు చెప్పుకొచ్చారు. ఇక హైకోర్టులో కూడా సర్కార్ కు ఇవాళ మరో షాక్ తగిలింది.
ఈ కేసులో సీబీఐ విచారణను సవాల్ చేస్తూ 3 వారాల సమయం కావాలని లంచ్ మోషన్ పిటీషన్ కు నిన్న హైకోర్టు (High Court) అనుమతించగా ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటీషన్ విచారణకు సీజే అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. రేపు సీజే అనుమతి తీసుకుంటామని నిన్న ఏజీ హైకోర్టు (High Court) కు తెలిపారు. ఇక తాజాగా నేడు విచారణ ప్రారంభం కాగా సింగిల్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో విచారణకు సింగిల్ బెంచ్ నిరాకరించింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సింగిల్ బెంచ్ విచారణ జరపదని సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించింది. సింగిల్ బెంచ్ కు వెళ్లడం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. దీనితో హైకోర్టు (High Court) లో మరోసారి కేసీఆర్ సర్కార్ కు షాక్ తగిలినట్లైంది.
ఎమ్మెల్యేల కొనుగోలు (MLAa Poaching Case) కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. మొదట ఈ కేసును సిట్ (Special Investigation Team) దర్యాప్తు చేసింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో సీబీఐ (Central Burew Of Investigation) కి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే సీబీఐ (Central Burew Of Investigation) విచారణ అవసరం లేదని ప్రభుత్వం సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ అప్పీల్ పై విచారణ జరిపిన కోర్టు సీబీఐకి విచారణ అప్పగిస్తూ కీలక తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా..అక్కడా షాక్ తగిలింది.
సీఎస్ కు సీబీఐ లేఖ..
ఇక ఈ కేసులో సీబీఐ తెలంగాణ సీఎస్ శాంతికుమారికి లేఖ రాసినట్లు తెలుస్తుంది. కేసుకు సంబంధించి కీలక విషయాలు సాక్ష్యాలు, FIR వంటివి అప్పగించాలని ఈ లేఖలో సీబీఐ పేర్కొన్నట్లు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana, TRS MLAs Poaching Case