హోమ్ /వార్తలు /తెలంగాణ /

Anganwadi teacher: ఈ అంగన్​వాడీ టీచర్​ మనసు నిజంగా బంగారమే.. ఏం చేసిందో తెలుసా?

Anganwadi teacher: ఈ అంగన్​వాడీ టీచర్​ మనసు నిజంగా బంగారమే.. ఏం చేసిందో తెలుసా?

అనాథలతో దాతలు

అనాథలతో దాతలు

రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను అక్కున చేర్చుకొని అధైర్య పడవద్దు నేనున్నానంటూ ఆసరగా నిలిచారు దంపతులు.

(K . Veeranna, News 18, Medak)

రోడ్డు ప్రమాదంలో (Road accident) తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులను అక్కున చేర్చుకొని అధైర్య పడవద్దు నేనున్నానంటూ ఆసరగా నిలిచారు దంపతులు. వాళ్లే సామాజిక కార్యకర్త ఇందు ప్రియల్ (Indu Priyal),  అంగన్​వాడీ టీచర్ మహమ్మద్ సుల్తానా ఉమర్ దంపతులు (MD Sulthana Umar). సిద్దిపేట (Siddipeta) జిల్లా మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామానికి చెందిన బాలమణి-తిరుమలేష్ దంపతులు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారికి కూతురు రాజేశ్వరి, కుమారుడు వరుణ్ ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో చిన్నారులు అనాధలుగా మారారు. గురువారం సామాజిక కార్యకర్త సుల్తానా ఉమర్ దంపతులు ఆ చిన్నారులను పరామర్శించి బియ్యం, నిత్యవసర సరుకులు ఆర్థిక సహాయం అందజేశారు.

ఇలాంటి దుస్థితి ఏ పిల్లలకు రాకూడదని..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాసులాబాద్ గ్రామానికి చెందిన బాలమణి- తిరుమలేష్ దంపతులు ఇద్దరు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఎంతో విషాదకరమన్నారు. వారి పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో అనాథలుగా మారారని ఇలాంటి దుస్థితి ఏ పిల్లలకు రాకూడదన్నారు. అల్లారుముద్దుగా ఆడుతూ పాడుతూ పెరగాల్సిన వయసులో జన్మనిచ్చి పెంచి పోషించిన తల్లిదండ్రులు శాశ్వతంగా దూరం కావడంతో ఆ చిన్నారులకు తల్లిదండ్రులు లేనిలోటు ఎవరు తీర్చలేమని, కానీ వారి చదువులు, బాగోగులు చూసుకోవడానికి మానవతా దృక్పథంతో ముందుకు రావడం జరిగిందన్నారు.

Kakatiya: 700 ఏళ్ల తర్వాత తెలంగాణలోని ఓరుగల్లుకు ఆ వ్యక్తి.. పూర్తి వివరాలివే

ఇలాంటి చిన్నారులకు అండగా నిలవడమే నిజమైన మానవత్వమని ఎంత సంపాదించినా లేని తృప్తి ఇలాంటి చిన్నారులకు సహాయం చేస్తే సంతృప్తిగా ఉంటుందని, మానవ జీవితానికి ఆదర్శంగా ఉంటుందన్నారు దంపతులు. ఈ చిన్నారులకు సమాజమే తోడుగా నిలవాలని వారు కోరారు.

Kidnap Chase: చిన్న క్లూతో చిన్నారి కిడ్నాప్​ మిస్టరీని ఛేదించిన పోలీసులు.. ఎలా చేశారో తెలుసా?

కూతురు రాజేశ్వరి ఇటీవల ప్రకటించిన పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యిందని తెలిపారు. ఆ ఫలితాలు విడుదలైన రోజునే తల్లిదండ్రులు మృతి చెంది పాసైన ఆనందాన్ని పంచుకోలేక తల్లిదండ్రులు  తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ్ 8 వ తరగతి చదువుతున్నాడని ఇరువురి చదువులకు తమ వంతు సహకారం అందిస్తామని మానవతావాదులు ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి ఈ చిన్నారులకు చేదోడు వాదోడుగా నిలవాలని దంపతులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక  సేవకులు మహమ్మద్ ఉమర్, స్థానికులు చార్వాక కుమార్,కిరణ్, రాజేశం, స్వామి,నీలం  కుమార్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

First published:

Tags: Anganwadi, Help for poor, Siddipeta

ఉత్తమ కథలు