సోషల్ బ్లాగింగ్ (Social Blogging) దిగ్గజం ట్విట్టర్ (Twitter) నూతన సీఈవోగా (CEO) భారత సంతతి వ్యక్తి పరాగ్ అగర్వాల్ (PArag Agarwal) నియామకం జరిగిన విషయం తెలిసిందే. ట్విట్టర్ సహ-వ్యవస్థాపకుడు జాక్ డోర్సే (Jack Dorsey) రాజీనామా తర్వాత, కంపెనీ తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా పరాగ్ అగర్వాల్ను నియమించింది. దిగ్గజ సంస్థ పగ్గాలు మన భారతీయుడికి దగ్గడంతో యావత్ దేశం గర్విస్తోంది. పరాగ్ అగర్వాల్ను అభినందిస్తూ సెలబ్రెటీలు, వ్యాపార దిగ్గజాలు ట్వీట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, పరాగ్ అగర్వాల్ సీఈవో పదవి చేపట్టడంతోనే ట్విట్టర్లో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా యూజర్ల వ్యక్తిగత భద్రతను (Privacy) కాపాడేందుకు గోప్యతా విధానాన్ని అప్డేట్ చేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ఈరోజు నుంచి, సమ్మతి లేకుండా ప్రైవేట్ వ్యక్తుల చిత్రాలు లేదా వీడియోలు షేర్ చేయడానికి కంపెనీ అనుమతించదని స్పష్టం చేసింది.
ఇప్పటికే ఇంటి చిరునామా, గుర్తింపు పత్రాలు, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నంబర్ వంటి సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసే మీడియా ఫైళ్లను కంపెనీ నిషేధించింది. అయినప్పటికీ, కొంత మంది వ్యక్తులు ఇతరుల గోప్యతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. అందువల్ల వ్యక్తిగత వివరాలతో వేధింపులు లేదా దాడికి దారితీసే పోస్ట్లను కఠినంగా అణిచివేసే లక్ష్యంతో ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది.
Whatsapp: వాట్సప్లో ఈ చిన్న ఫీచర్స్ తెలుసుకోండి.. ఉపయోగపడతాయి!
ఈ కొత్త అప్డేట్ గురించి ట్విట్టర్ తన బ్లాగ్ పోస్ట్లో వివరిస్తూ ‘‘ట్విట్టర్ నియమాలను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. అటువంటి వారిని నియంత్రించేందుకు ఈ అప్డేట్ను తీసుకొస్తున్నాం. వ్యక్తుల అనుమతి లేకుండా వారి ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేయడం అనేది మా భద్రతా నిబంధనలకు వ్యతిరేకం. అటువంటి పోస్ట్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ఈ కొత్త నిబంధన నేటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది.” అని పేర్కొంది.
* ఉల్లంఘన కింద వచ్చే అంశాలేంటి?
- హోమ్ అడ్రస్, స్ట్రీట్ అడ్రస్, ప్రైవేటు వ్యక్తుల ఇంటికి సంబంధించిన జీపీఎస్ లొకేషన్ను షేర్ చేయడం..
- ప్రభుత్వం జారీ చేసిన ఐడెంటిటీ కార్డులు, సామాజిక భద్రత లేదా ఇతర జాతీయ గుర్తింపు కార్డులను ట్విట్టర్లో షేర్ చేయడం.
- వ్యక్తిగత ఫోన్ నంబర్లు లేదా ఇమెయిల్ చిరునామాలతో సహా కాంటాక్డ్ డీటెయిల్స్ను షేర్ చేయడం.
- బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్ వివరాలతో సహా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయడం.
- వ్యక్తుల అనుమతి లేకుండా వారి ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం.
- కొత్త అప్డేట్ ప్రకారం, ఒక యూజర్ లేదా అథారిటీ ట్విట్టర్ ప్రైవసీ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే.. కంపెనీ ఆ పోస్ట్ను తొలగిస్తుంది. అయితే పబ్లిక్ ఫిగర్లకు సంబంధించి మీడియా షేర్ చేసే పోస్టులకు ఈ నిబంధన వర్తించదు. ఒకవేళ సదరు పోస్టుపై ఆ పబ్లిక్ ఫిగర్ ఏమైనా అభ్యంతరాలు లేవనెత్తితే “దుర్వినియోగ ప్రవర్తన” కింద ఆ పోస్టును కంపెనీ తొలగిస్తుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Twitter