హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

TV Price Hike: మరోసారి పెరగనున్న టీవీల ధరలు... త్వరపడండి

TV Price Hike: మరోసారి పెరగనున్న టీవీల ధరలు... త్వరపడండి

TV Price Hike: మరోసారి పెరగనున్న టీవీల ధరలు... త్వరపడండి
(ప్రతీకాత్మక చిత్రం)

TV Price Hike: మరోసారి పెరగనున్న టీవీల ధరలు... త్వరపడండి (ప్రతీకాత్మక చిత్రం)

TV Price Hike | టీవీ కొనాలనుకొని కొనలేదా? త్వరలో టీవీల ధరలు పెరగబోతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు టీవీల ధరలు పెరిగాయి.

దేశంలో టీవీల ధరలకు​ మరోసారి రెక్కలు రానున్నాయి. సరుకు రవాణా ఖర్చులు, నిర్వహణ వ్యయం భారం కావడంతో ఏప్రిల్‌ నెలలో వీటి ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అయితే, టెలివిజన్​ స్క్రీన్ల తయారీలో ఉపయోగించే ఓపెన్​ సెల్​ ప్యానెళ్లపై కస్టమ్స్​ డ్యూటీ పెంచాలని కేంద్రం భావిస్తుండటంతో వీటి ధరలు మరోసారి 3 నుంచి 4 శాతం పెరిగే అవకాశం ఉంది. టీవీల తయారీలో ఉపయోగించే ఓపెన్​ సెల్​ ప్యానెళ్లు ఎక్కువగా చైనా నుంచి దిగుమతి అవుతుంటాయి. దేశీయంగా ఎక్కువ విక్రయాలు జరిపే ప్రధాన బ్రాండ్లయిన శామ్సంగ్​​, ఎల్​జీ, సోనీ, పానసోనిక్​, హైయర్​, థామ్సన్​, కొడాక్​, ఎంఐ, వన్​ప్లస్​ కంపెనీలు చైనా నుంచే ఓపెన్​ సెల్​ ప్యానెళ్లను దిగుమతి చేసుకుంటాయి. దీంతో వీటిపై కస్టమ్​ డ్యూటీ పెరిగితే ధరలు కూడా అమాంతం పెరిగే అవకాశం ఉంది.

ధరల పెంపుపై పానాసోనిక్ ఇండియా సౌత్ ఆసియా ప్రెసిడెంట్​, సీఈఓ మనీష్ శర్మ మాట్లాడుతూ, ‘‘ప్రస్తుత ముడిసరుకు, రవాణా ఖర్చులకు అనుగుణంగా 3–4 శాతం మేర టీవీ ధరలను పెంచాలని యోచిస్తున్నాం.” అని అన్నారు. ఇక, మరో టెలివిజన్​ కంపెనీ హైయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రాగన్జా మాట్లాడుతూ ‘‘ముడి సరుకు, రవాణా ఛార్జీలు పెరగడంతో మా ఉత్పత్తుల ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదు. అందువల్లే, మా కంపెనీ టీవీలపై 3 నుంచి 4 శాతం ధరలను పెంచబోతున్నాం. ఈ కొత్త ధరలు జూన్​ 20 నుండి అమల్లోకి వస్తాయి” అని అన్నారు. ఇక, ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ థామ్సన్, అమెరికాకు చెందిన కొడాక్ బ్రాండ్ కూడా రాబోయే రోజుల్లో తమ టీవీలపై రూ .1,000 నుంచి 2,000 వరకు ధరలు పెంచనున్నట్లు ప్రకటించాయి.

WhatsApp: బీ రెడీ... వాట్సప్‌లో రాబోతున్న 5 కొత్త ఫీచర్స్ ఇవే

PAN Aadhaar Linking: పాన్-ఆధార్ లింకింగ్‌కు 2 వారాలే గడువు... చేయకపోతే ఈ చిక్కులు తప్పవు

ఈ ఏడాది ఇది మూడోసారి


కాగా, టీవీ రేట్లు పెరగడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి కానుంది. ప్యానెళ్ల రేట్లు పెరుగుతాయనే కారణంతో జనవరి, ఏప్రిల్​లో టీవీల ధరలను కంపెనీలు పెంచాయి. అయితే, కేంద్రం కస్టమ్ డ్యూటీ పెంచాలని యోచిస్తుండటంతో​ మరోసారి వీటి ధరలు పెరగనున్నాయి. కాగా, టెలివిజన్​ తయారీలో ఓపెన్ సెల్ ప్యానెల్​ ఒక ముఖ్యమైన భాగం. టెలివిజన్ మొత్తం ధరలో ఇదే 70 శాతం వరకు ఉంటుంది. తయారీదారులు ఈ ప్యానెళ్లను చైనా నుండి దిగుమతి చేసుకుంటారు. కొన్ని కంపెనీలు మాత్రం తైవాన్, థాయ్‌లాండ్, వియత్నాం వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. ప్రస్తుతం, చైనాలోని షెన్‌జెన్ నుండి న్వా షెవా వరకు సముద్ర మార్గం ద్వారా వీటిని తరలించేందుకు ఒక కంటైనర్​కు 4,200 డాలర్ల ఖర్చవుతుంది.

Online Gold: ఆన్‌లైన్‌లో నగలు కొనేముందు ఈ 9 టిప్స్ గుర్తుంచుకోండి

SBI Offer: ఎస్‌బీఐలో ఆ అకౌంట్ ఉన్నవారికి రూ.2,00,000 ఉచిత ఇన్స్యూరెన్స్


అయితే, ఏడాదిన్నర క్రితం ఈ ఖర్చు కేవలం 600 డాలర్లు మాత్రమే ఉండేది. ఫలితంగా, గతేడాది జూన్ నుండి ఓపెన్ సెల్ ప్యానెళ్ల ధరలు 300 నుంచి -400 శాతం పెరిగాయి. కస్టమ్​ డ్యూటీ పెరుగుతుండటంతో మరోసారి ధరలు పెంచాల్సిన అనివార్యత ఏర్పడింది. కాగా, భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్​లో టెలివిజన్​ది అతి పెద్ద వాటా. వీటి మార్కెట్​ వాల్యూ దాదాపు రూ .25,000 కోట్లకు పైమాటే.2018–19లో 175 లక్షల యూనిట్లుగా ఉన్న భారతీయ టెలివిజన్​ మార్కెట్ 2024–25లో 284 లక్షల యూనిట్లకు పెరుగుతుందని అంచనా.

First published:

Tags: Android TV, MI LED TV, Smart TV

ఉత్తమ కథలు