మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజైన సెప్టెంబర్ 5న టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు భారతీయులు. ఈసారి సెలబ్రేషన్స్లో గూగుల్ కూడా చేరిపోయింది. ప్రపంచంలోని టీచర్లందరికీ హోమ్ పేజీలో డూడుల్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది గూగుల్. డూడుల్పైన ఉన్న గ్లోబ్ పైన క్లిక్ చేస్తే ఆ గ్లోబ్ టీచర్లా మారుతుంది. స్పోర్ట్స్, మ్యూజిక్, ఫిజిక్స్, అంతరిక్ష శాస్త్రం ఇలా అన్ని అంశాలకు సంబంధించిన ఐకాన్స్ అన్నీ చుట్టూ కనిపిస్తాయి.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న జన్మించారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన ఆయన భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి, ఆ తర్వాత రాష్ట్రపతి పదవిని అలంకరించారు. ఆయన జన్మదినాన్ని టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు భారతీయులు. ఈ ఆనవాయితీ 1962లో మొదలైంది. ఈ రోజున విద్యాసంస్థల్లో సంబరాలు చేసుకుంటారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. విద్యార్థులు తమతమ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతుంటారు. అందుకే ఈ రోజును గూగుల్ తన స్టైల్లో డూడుల్తో సెలబ్రేట్ చేస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా టీచర్స్ డేని అక్టోబర్ 5న జరుపుకోవడం విశేషం. సరిగ్గా ఒక నెల తర్వాత అన్నమాట.
ఇవి కూడా చదవండి:
Video: 6 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా?
Photos: యాపిల్ లాంఛ్ చేసే గ్యాడ్జెట్స్ ఇవేనా?
ఇండియాలో లాంఛైన హానర్ 7ఎస్
నాచ్ డిస్ప్లేతో మోటో పీ30 నోట్!Published by:Santhosh Kumar S
First published:September 05, 2018, 10:33 IST