సాంసంగ్ నుంచి మరో స్మార్ట్ఫోన్ ఇండియాలో రిలీజ్ అయింది. ఇప్పటికే యూకే మార్కెట్లో రిలీజ్ అయిన సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ స్మార్ట్ఫోన్ను ఇండియాకు పరిచయం చేసింది కంపెనీ. ఇన్ఫినిటీ ఓ హోల్ పంచ్ డిస్ప్లే, క్వాడ్ కెమెరా, ఆక్టాకోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ రిలీజ్ కాగానే సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్తో పాటు అన్ని రీటైల్ స్టోర్లలో ఈ ఫోన్ కొనొచ్చు.
సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.5 అంగుళాల హెచ్డీ+ ఇన్ఫినిటీ ఓ డిస్ప్లే
ర్యామ్: 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: ఆక్టాకోర్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్
రియర్ కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+వన్ యూఐ
కలర్స్: బ్లాక్, బ్లూ, వైట్
ధర:
4జీబీ+64జీబీ- రూ.16,499
6జీబీ+64జీబీ- రూ.18,499
ఇవి కూడా చదవండి:
Vodafone Idea: వొడాఫోన్ ఐడియా నుంచి రూ.251 ప్లాన్... బెనిఫిట్స్ ఇవే
Nokia 5310: నోకియా నుంచి మరో ఫీచర్ ఫోన్... ధర రూ.3,399 మాత్రమే
Motorola: అదిరిపోయే ఫీచర్స్తో 'మోటోరోలా వన్ ఫ్యూజన్+' రిలీజ్... ధర తెలిస్తే షాకే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android 10, Samsung, Smartphone, Smartphones