ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో పట్టుకోసం ప్రయత్నిస్తున్న నోకియా... మరో రెండు స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. నోకియా 5.4, నోకియా 3.4 మోడల్స్ని ఇండియాలో రిలీజ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లలో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 4,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం విశేషం. నోకియా 5.4 స్మార్ట్ఫోన్లో క్వాడ్ కెమెరా సెటప్, నోకియా 3.4 మోడల్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తాయి. త్వరలో ఆండ్రాయిడ్ 11 అప్డేట్ లభిస్తుంది. నోకియా 5.4, నోకియా 3.4 గతంలోనే ఇతర దేశాల్లో రిలీజ్ అయ్యాయి. వీటిని ఇండియాకు తీసుకొస్తామని గతంలోనే ప్రకటించింది నోకియా. టీజర్లతో ఊరిస్తోంది. నోకియా 5.4 ప్రారంభ ధర రూ.13,999 కాగా, నోకియా 3.4 ధర రూ.11,999. నోకియా వెబ్సైట్లో ప్రీబుకింగ్ మొదలైంది. ఫిబ్రవరి 17న నోకియా 5.4 స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20 నుంచి నోకియా 3.4 స్మార్ట్ఫోన్ కొనొచ్చు. నోకియా వెబ్సైట్తో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్, రీటైల్ ఔట్లెట్స్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి.
ఇక నోకియా పవర్ ఇయర్బడ్స్ లైట్ కూడా లాంఛ్ అయ్యాయి. చార్కోల్, స్నో కలర్స్తో కొనొచ్చు. ధర రూ.3,599. ఫిబ్రవరి 17న సేల్ మొదలవుతుంది. నోకియా 3.4 స్మార్ట్ఫోన్తో కలిపి కొంటే రూ.1,600 డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక కొద్ది రోజుల క్రితం నోకియా 2.4 ఇండియాలో రిలీజైంది. 3జీబీ వేరియంట్ ధర రూ.10,399. నోకియా నుంచి వచ్చే మోడల్స్ అన్నీ ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ఫోన్సే. ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ఫోన్లో కేవలం గూగుల్కు సంబంధించిన యాప్స్ మాత్రమే ఉంటాయి. థర్ట్ పార్టీ యాప్స్, బ్లోట్వేర్ ఉండదు. రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, సెక్యూరిటీ అఫ్డేట్స్ లభిస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.