స్వదేశీ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ కార్బన్ తాజాగా స్మార్ట్ టీవీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఒకే సారి మూడు ఎల్ఈడీ స్మార్ట్టీవీలను లాంచ్ చేసింది. కంపెనీ తన ఆఫ్లైన్ మార్కెట్ను విస్తరించుకునేందుకు రిలయన్స్ డిజిటల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో ఈ స్మార్ట్టీవీలను రిలయన్స్ డిజిటల్ స్టోర్స్లలో కొనుగోలు చేయవచ్చు. భారత ప్రభుత్వం చేపట్టిన 'మేడ్ ఇన్ ఇండియా', 'మేడ్ ఫర్ ఇండియా' చొరవతో ఈ మూడు ఎల్ఈడీ స్మార్ట్టీవీలను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్టీవీలలో క్వాలిటీ డిజైన్, ఇన్ బిల్ట్ యాప్ స్టోర్ను అందించింది. స్మార్ట్ఫోన్తో ఈ స్మార్ట్టీవీని కనెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాగా, రాబోయే రెండేళ్లలో 15 మోడళ్లకు స్మార్ట్ ఎల్ఈడీ టీవీ మార్కెట్ను విస్తరించాలని కార్బన్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ స్మార్ట్ టీవీల లాంచింగ్పై కార్బన్ ఎండీ పర్దీప్ జైన్ మాట్లాడుతూ, “భారతీయ వినియోగదారులు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే మేడ్ ఇండియా చొరవతో ఒకేసారి మూడు స్మార్ట్ ఎల్ఈడీ టీవీలను లాంచ్ చేశాం. బడ్జెట్ ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లను అందించాం” అని చెప్పారు.
ఇంట్లోనే థియేటర్ ఎక్స్పీరియన్స్..
కార్బన్ ప్రస్తుతం 32, 39, 24 అంగుళాల స్మార్ట్టీవీలను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ మొత్తం మూడు మోడళ్లలో అందుబాటులో ఉంటుంది. KJW39SKHD, KJW32SKHD (బేజిల్ లెస్ డిజైన్), KJWY32SKHD పేర్లతో ఇవి విడుదలయ్యాయి. వీటితో పాటు KJW24NSHD, KJW32NSHD ఎల్ఈడీ మోడళ్లను కూడా సంస్థ ఆవిష్కరించింది. ఈ స్మార్ట్టీవీలు వినియోగదారులకు మంచి ఎంటర్టైన్మెంట్ అనుభవాన్ని అందిస్తాయి.
ఇవి శక్తివంతమైన సౌండ్ సిస్టమ్ గల బెజెల్-లెస్ డిజైన్తో వస్తాయి. అయితే ఏయే టీవీలకు ఎంత ధర నిర్ణయించిన విషయాన్ని మాత్రం కంపెనీ ఇప్పటివరకు రివీల్ చేయలేదు. కానీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీల ప్రారంభ ధర రూ. 7,990 నుంచి ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. ఈ స్మార్ట్ టీవీలలోని బ్యూటిఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఫ్లోయింగ్ సౌండ్, వైడ్ వ్యూయింగ్ యాంగిల్ మంచి థియేటర్ అనుభవాన్ని అందిస్తాయి. ఈ టీవీల్లో ప్రీ ఇన్స్టాల్ మూవీ బాక్స్ను కూడా అమర్చింది. దీన్ని మల్టిపుల్ డివైజ్లకు కనెక్ట్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget, Smart TV, Technology