ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. అమెజాన్కు గట్టి పోటీనిస్తూ ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తోంది. కరోనాతో సుదీర్ఘకాలంగా తెరుచుకోని స్కూళ్లు, కాలేజీలు త్వరలోనే ప్రారంభం కానుండటంతో వారి కోసం ప్రత్యేక సేల్ ప్రారంభించింది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 'బ్యాక్ టు కాలేజ్ గాడ్జెట్ష్ కార్నివల్ సేల్'ను సంస్థ మొదలు పెట్టింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ జూన్ 24 వరకు కొనసాగనుంది. ముఖ్యంగా విద్యార్థులకు ఎక్కువగా ఉపయోగపడే ప్రముఖ గాడ్జెట్స్పై 80 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. EMI ఆప్షన్తో కూడా ఈ గాడ్జెట్స్ కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.
Mi 11 Lite: ఎంఐ 11 లైట్ వచ్చేసింది... రూ.3,000 డిస్కౌంట్ పొందండి ఇలా
Motorola Rugged Mobile: ఈ స్మార్ట్ఫోన్ను నీళ్లల్లో నానబెట్టి, సబ్బుతో కడిగేయొచ్చు
ఫ్లిప్కార్ట్ సేల్లో భాగంగా బోట్, వన్ప్లస్, జెబిఎల్, రియల్మీ, ఫిలిప్స్ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన బ్లూటూత్, హెడ్ఫోన్లపై 60 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఇక, బోట్ ఎయిర్డోప్స్ 131 బ్లూటూత్ హెడ్సెట్పై 56 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. వీటిని రూ.1,299 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. మివి డుయోపాడ్స్ ఎం 20 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ హెడ్సెట్ను కేవలం రూ .999 ధర వద్దే లభిస్తుంది. రియల్మీ బడ్స్ వైర్డ్ హెడ్సెట్ను రూ .599 ధర వద్దే కొనుగోలు చేయవచ్చు. టాబ్లెట్లు, గేమింగ్ మానిటర్లపై ఫ్లిప్కార్ట్ 45 శాతం తగ్గింపును కూడా ఇస్తోంది.
ఈ సేల్లో భాగంగా ప్రింటర్లను రూ. 2,199, సాలిడ్-స్టేట్ డ్రైవ్ లేదా SSDని రూ. 5,999 ప్రారంభ ధర వద్దే కొనుగోలు చేయవచ్చు. ఇక, యూపిఎస్ను రూ. 1799 ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. వీటితో పాటు ప్రముఖ కంపెనీలకు చెందిన బ్లూటూత్, పార్టీ స్పీకర్లపై వరుసగా 60 శాతం, 70 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.
Samsung Galaxy M32: రూ.14,999 ధరతో సాంసంగ్ గెలాక్సీ ఎం32 రిలీజ్... ఫీచర్స్ ఇవే
WhatsApp Status: వాట్సప్ యూజర్లకు అలర్ట్... ఇక ఆ ఫీచర్ ఉండదు
జూన్ 24 వరకు ఆఫర్లు
విద్యార్థులకు ఎంతో కీలకంగా ఉపయోగపడే ల్యాప్టాప్లపై కూడా భారీ ఆఫర్లను ప్రకటించింది. సాధారణ ల్యాప్టాప్లు, గేమింగ్ ల్యాప్టాప్లకు ప్రత్యేక డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ల్యాప్టాప్లు రూ .30,000 ప్రారంభ ధర వద్ద లభిస్తాయి. మరోవైపు ల్యాప్టాప్ స్టాండ్లు, కీబోర్ట్, మౌస్పై కూడా డిస్కౌంట్ అందిస్తోంది. హెచ్పి, లెనోవా, ఆసుస్, ఎసెర్, డెల్, హెచ్పి వంటి బ్రాండ్ల ల్యాప్టాప్లు ఈ సేల్లో తక్కువ రేటుకే లభిస్తాయి. లెనోవా ఐడియా ప్యాడ్ ఎస్ 145 కోర్ ఐ 5 10వ జెన్ ల్యాప్టాప్ రూ .43,990 ధర వద్ద లభించనుండగా.. దీనిపై ఏకంగా, 35 శాతం డిస్కౌంట్ అందజేస్తుంది. నోకియా ప్యూర్బుక్ ఎక్స్ 14 కోర్ ఐ 5 10 వ జెన్ను రూ .47,990 ధర వద్దే కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్లో విద్యార్థులు ఎక్కువగా ఇష్టపడే గాడ్జెట్స్పై దృష్టిసారించింది. ఈ ప్రత్యేక డిస్కౌంట్లతో సేల్స్ పెంచుకోవాలని భావిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.