ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికల సందడి మార్చి 29 వరకు ఉంటుంది. ఈ ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించింది. 'నిఘా' పేరుతో తయారు చేసిన యాప్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిలోని క్యాంప్ ఆఫీస్లో ఆవిష్కరించారు. ఎన్నికల్లో డబ్బు, ఆల్కహాల్ పంపకాలను అడ్డుకోవడం, ఎన్నికల అక్రమాలపై సామాన్యుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడమే ఈ యాప్ లక్ష్యం.
Chief Minister YS Jagan Mohan Reddy launched ‘NIGHA’ app to ensure ‘clean and healthy’ elections by curbing the use of money and alcohol in the upcoming local body elections. NIGHA app empowers common citizens to lodge complaints on electoral malpractices. pic.twitter.com/T1FhTOjKTt
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 7, 2020
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారు చేసిన నిఘా యాప్ను స్మార్ట్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలను గుర్తించే ప్రజలు నేరుగా యాప్లో కంప్లైట్ చేయొచ్చు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు, మద్యం, గిఫ్ట్స్ లాంటివి ఇచ్చినా, ఇంటి ఓనర్ అనుమతి లేకుండా పోస్టుర్లు, బ్యానర్స్ అతికించినా, ఆయుధాలతో తిరుగుతున్నా యాప్లో కంప్లైంట్ ఇవ్వొచ్చు. ఫోటోలు, వీడియోలు తీసి అప్లోడ్ చేయొచ్చు. కంప్లైంట్తో పాటు జీపీఎస్ ద్వారా మీ లొకేషన్ ఎన్నికల అధికారులకు వెళ్తుంది. ఆ తర్వాత అధికారులు చర్యలు ప్రారంభిస్తారు. మీ కంప్లైంట్ స్టేటస్ని కూడా యాప్లో తెలుసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
DEET App: ఈ యాప్ ఉంటే... ఉద్యోగం వెతకడం ఈజీ
Womens Day 2020: భారతీయ రైల్వే నుంచి మహిళా ప్రయాణికులకు బెనిఫిట్స్ ఇవే
Indian Railways: రైలులో ఇచ్చే బ్లాంకెట్స్ వాడుతున్నారా? ఈ విషయం తెలుసా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, Ap cm jagan, Ap cm ys jagan mohan reddy, Ap local body elections, AP News, Cm jagan, Mobile App, Telugu news, Telugu updates, Telugu varthalu, Ys jagan, Ys jagan mohan reddy