హోమ్ /వార్తలు /క్రీడలు /

IND W vs UAE W : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 104 పరుగుల తేడాతో విక్టరీ.. టీమిండియాతో పెట్టుకుంటే ఇలానే ఉంటది

IND W vs UAE W : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 104 పరుగుల తేడాతో విక్టరీ.. టీమిండియాతో పెట్టుకుంటే ఇలానే ఉంటది

PC : BCCI

PC : BCCI

Women's Asia Cup 2022 - IND W vs UAE W : మహిళల ఆసియా కప్ (Asia Cup) 2022లో టీమిండియా (Team India) మహిళల జట్టు జోరు మీదుంది. టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి హ్యాట్రిక్ ను పూర్తి చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Women's Asia Cup 2022 - IND W vs UAE W : మహిళల ఆసియా కప్ (Asia Cup) 2022లో టీమిండియా (Team India) మహిళల జట్టు జోరు మీదుంది. టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి హ్యాట్రిక్ ను పూర్తి చేసింది. బంగ్లాదేశ్ (Bangladesh) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో యూఏఈ (UAE)పై భారత్ ఏకంగా 104 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 74 పరుగులు మాత్రమే చేసింది. రాజేశ్వరి గైక్వాడ్ 2 వికెట్లు తీశాడు. యూఏఈ కవిశ (54 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు), ఖుషి శర్మ (50 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు) టెస్టు బ్యాటింగ్ చేశారు. ఈ విజయంతో టోర్నీలో మూడో విజయాన్ని నమోదు చేసిన భారత్ 6 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 75 నాటౌట్; 11 ఫోర్లు), దీప్తి శర్మ (49 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. యూఏఈ బౌలర్లలో చాయ మొగల్, మహిక గౌర్, ఇషా ఒజా, సురక్ష తలా ఒక వికెట్ సాధించారు.

20 పరుగులకే మూడు వికెట్లు

టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. రెగ్యులర్ ఓపెనర్ స్మృతి మంధాన స్థానంలో రిచా ఘోష్.. సబ్బినేని మేఘనతో కలిసి ఓపెనింగ్ కు వచ్చింది. అయితే రిచా ఘోష్ (0) ఎదర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యింది. ఆ తర్వాత ఫోర్ కొట్టి టచ్ లో కనిపించిన సబ్బినేని మేఘన (10) అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి పెవిలియన్ కు చేరింది. రివ్యూ నిబంధన ఈ టోర్నీలో లేదు. దాంతో ఆమె రివ్యూ తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఇక దీప్తి శర్మతో సమన్వయ లోపం కారణంగా హేమలత (2) రనౌట్ అయ్యింది. దాంతో భారత్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

నిలబెట్టిన భాగస్వామ్యం

ఈ దశలో క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ మరోసారి తనదైన శైలిలో ఆడి జట్టును ఆదుకుంది. క్లీన్ హిట్టింగ్స్ తో బౌండరీలు రాబట్టింది. ఈ క్రమంలో దీప్తి శర్మతో కలిసి నాలుగో వికెట్ కు 128 పరుగులు జోడించింది. దీప్తి, జెమీమా ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నాక మరింత వేగంగా ఆడారు. భారీ షాట్ కు ప్రయత్నించిన దీప్తి శర్మ పెవిలియన్ కు చేరింది. ఇక చివర్లో జెమీమా దూకుండా ఆడటంతో భారత్ మంచి స్కోరును సాధించింది. రెగ్యులర్ ఓపెనర్ స్మృతి మంధానకు ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడం విశేషం.

First published:

Tags: Bangladesh, India, Smriti Mandhana, Team India, UAE, Women's Asia Cup

ఉత్తమ కథలు