ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ముగిసిన పది రోజుల తర్వాత దక్షిణాఫ్రికా(South Africa)తో భారత్ (India) పొట్టి ఫార్మాట్ లో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆడనుంది. ఇందుకోసం సౌతాఫ్రికా జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ సిరీస్ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.ఐర్లాండ్తో రెండు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉండగా.. ఇంగ్లండ్లో గతేడాది మిగిలిపోయిన చివరి టెస్ట్తో పాటు పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. ఈ రెండు సిరీస్ లకు సంబంధించిన జట్లను బీసీసీఐ కాసేపటి క్రితమే ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో అయిదు టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడబోయే జట్టులో ఊహించినట్టే సన్రైజర్స్ హైదరాబాద్ స్పీడ్ స్టర్ ఉమ్రాన్ మాలిక్కు చోటు దక్కింది.
అతనితో పాటు అర్ష్దీప్ సింగ్ను సైతం ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్షన్ కమిటీ. అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్లను జట్టులోకి తీసుకుంది. మొత్తం 18 మందితో కూడిన ఈ జట్టును పేర్లను తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది. టీ20 జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యాన్ని వహించనున్నాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ రిషభ్ పంత్ వైస్ కెప్టెన్గా అపాయింట్ అయ్యాడు.
దీనితోపాటు పనిలో పనిగా ఇంగ్లాండ్లో పర్యటించే భారత జట్టును కూడా ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ శర్మ సారథ్యాన్ని వహిస్తాడు ఈ జట్టుకు. వైస్ కేప్టెన్ బాధ్యతలను కేఎల్ రాహుల్కు అప్పగించింది. కేఎస్ భరత్ను జట్టులోకి తీసుకుంది. ఏపీ తెలంగాణ నుంచి ముగ్గురు క్రికెటర్లు టెస్ట్ జట్టుకు ఎంపికయ్యారు. కేఎస్ భరత్, హనుమ విహారి, మహ్మద్ సిరాజ్.. ఈ ముగ్గురూ తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రికెటర్లే.
🚨 NEWS 🚨: India’s squad for @Paytm T20I series against South Africa and squad for 5th Test against England announced. #TeamIndia
ఐపీఎల్ తర్వాత దక్షిణాఫ్రికాతో స్వదేశంలో అయిదు మ్యాచ్ టీ20 సిరీస్ను ఆడుతుంది టీమిండియా. జూన్ 9వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభమౌతుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. రెండో మ్యాచ్ 12వ తేదీన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం, మూడో టీ20 14న మహారాష్ట్రలోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉంటుంది.
TEST Squad - Rohit Sharma (Capt), KL Rahul (VC), Shubman Gill, Virat Kohli, Shreyas Iyer, Hanuma Vihari, Cheteshwar Pujara, Rishabh Pant (wk), KS Bharat (wk), R Jadeja, R Ashwin, Shardul Thakur, Mohd Shami, Jasprit Bumrah, Mohd Siraj, Umesh Yadav, Prasidh Krishna #ENGvIND
17వ తేదీన నాలుగో మ్యాచ్ గుజరాత్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, 19న చివరి టీ20 ఢిల్లీలో షెడ్యూల్ చేసింది బీసీసీఐ. ఈ సిరీస్ కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తన జట్టును ఇదివరకే ప్రకటించింది కూడా. భారత పర్యటనకు వచ్చే 16 మంది సభ్యులు ఉన్న దక్షిణాఫ్రికా జట్టుకు టెంబా బావుమా సారథ్యాన్ని వహించనున్నాడు. ఈ నెల చివరన లేదా వచ్చే నెల మొదటివారంలో జట్టు భారత్కు చేరుకుంటుంది.
T20I Squad - KL Rahul (Capt), Ruturaj Gaikwad, Ishan Kishan, Deepak Hooda, Shreyas Iyer, Rishabh Pant(VC) (wk),Dinesh Karthik (wk), Hardik Pandya, Venkatesh Iyer, Y Chahal, Kuldeep Yadav, Axar Patel, R Bishnoi, Bhuvneshwar, Harshal Patel, Avesh Khan, Arshdeep Singh, Umran Malik
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.