టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics) భారత పురుషుల హాకీ జట్టు (Mens Hockey Team) దూసుకొని పోతున్నది. పూల్ ఏలో భాగంగా గురువారం ఉదయం అర్జెంటీనాతో (Argentina) జరిగిన మ్యాచ్లో 3-1 తేడాతో విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ అయిన అర్జెంటీనా తొలి క్వార్టర్లోనే గోల్ కొట్టి ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే భారత హాకీ ప్లేయర్లు ఆ తర్వాత ప్రత్యర్థి జట్టుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. 43వ నిమిషంలో టీమ్ ఇండియాకు వరుణ్ కుమార్ తొలి గోల్ అందించాడు. 58వ నిమిషంలో వివేక్ సాగర్ రెండో గోల్ చేశాడు. దాంతో ఆధిక్యం 2-1కి పెరిగింది. 59వ నిమిషంలో హర్మన్ ప్రీత్ సింగ్ మూడో గోల్ చేయడంతో భారత్కు 3-1తో తిరుగు లేని ఆధిక్యత లభించింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎలాంటి గోల్స్ చేయలేదు. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత భారత జట్టు 3-1తో విజయం సాధించింది. పూల్ ఏలో మూడు మ్యాచ్లు గెలిచిన టీమ్ ఇండియా పురుషులు క్వార్టర్ ఫైనల్లో బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్నారు. తర్వాత మ్యాచ్లో భారత జట్టు ఆతిథ్య జపాన్తో తలపడనున్నది.
#TOKYO2020 #STRONGERTOGETHER #HOCKEYINVITES @TheHockeyIndia v @ArgFieldHockey pic.twitter.com/jkdGt2vOBA
— International Hockey Federation (@FIH_Hockey) July 29, 2021
Terrific comeback from @TheHockeyIndia men as they beat defending champions Argentina by 3-1 to march into the quarters.
Many congratulations! ?#GoForGold #Hockey #Olympics @WeAreTeamIndia https://t.co/F8QTiapIja
— Odisha Sports (@sports_odisha) July 29, 2021
ఒలింపిక్స్లో తొలి మ్యాచ్ న్యూజీలాండ్పై నెగ్గిన భారత జట్టు.. ఆస్ట్రేలియాపై మాత్రం 1-7 తేడాతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఆ తర్వాత స్పెయిన్పై 3-0తో అర్జెంటీనాతో 3-1 తేడాతో గెలిచింది. శుక్రవారం భారత్-జపాన్ మధ్య మ్యాచ్ జరుగనున్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Olympics, Team India, Tokyo Olympics