ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022 (T20 World Cup 2022) టోర్నమెంట్ రసవత్తరంగా సాగుతోంది. తొలిరోజు నుంచే సంచలనాలు నమోదయ్యాయి. నమీబియా చేతిలో శ్రీలంక మట్టి దారుణ పరాజయాన్ని చవి చూసింది. ఆ తర్వాత స్కాట్లాండ్ చేతిలో రెండు సార్లు ఛాంపియన్ విండీస్ టీం ఖంగుతింది. సూపర్ -12కు క్వాలిఫై అవ్వడం కోసం ప్రతి జట్టు నువ్వా-నేనా అన్నట్టు పోరాడుతున్నాయి. ఇక, విండీస్ కు చావోరేవో పరిస్థితి. ఇక, హోబర్ట్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచులో విండీస్ బ్యాటర్లు మరో తడబడ్డారు. జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కరేబీయన్ జట్టు 153 పరుగులు చేసింది.
జాన్సెన్ ఛార్లెస్ (36 బంతుల్లో 45 పరుగులు ; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ ఆరంభంలో అదరగొట్టగా.. ఆఖర్లో, రావెమెన్ పొవెల్ ( 21 బంతుల్లో 28 పరుగులు) అఖిల్ హెస్సేన్ ( 18 బంతుల్లో 23 పరుగులు నాటౌట్) తో మెరుపులు మెరిపించారు. దీంతో.. విండీస్ జట్టు ఫైటింగ్ టోటల్ సాధించింది. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రాజా మూడు వికెట్లతో దుమ్మురేపగా.. సీన్ విలియమ్స్, ముజార్బానీ చెరో వికెట్ తో సత్తా చాటారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన విండీస్ కు ఛార్లెస్ మంచి ఆరంభాన్ని అందించాడు. మరో ఓపెనర్ కైల్ మేయర్స్ తో కలిసి ఇన్నింగ్స్ ను దూకుడుగా ప్రారంభించాడు. అయితే, ఊపు మీదున్న ఈ జోడికి ముజార్బానీ బ్రేకులు వేశాడు. 13 పరుగులు చేసిన మేయర్స్ ముజార్బానీ బౌలింగ్లో చకాబవకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
దీంతో.. 28 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది విండీస్ జట్టు. ఆ తర్వాత ఎవిన్ లూయిస్ తో కలిసి విండీస్ ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు ఛార్లెస్. అయితే, పవర్ హిట్టర్ అయిన లూయిస్ ఈ మ్యాచులో పరుగులు చేయడానికి నానా తంటాలు పడ్డాడు.
A late flourish with the bat has allowed West Indies to post a score of 153/7 ???? Will they defend this? #WIvZIM | #T20WorldCup | ???? Scorecard: https://t.co/73IUt5RZMq pic.twitter.com/WeZkDPmMeL
— ICC (@ICC) October 19, 2022
18 బంతుల్లో 15 పరుగులు చేసి రజా బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టాడు. దీంతో 77 పరుగులకు రెండో వికెట్ కోల్పోయింది. ఇక, ఆ తర్వాత నుంచి జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంతో విండీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పూరన్ (7), బ్రూక్స్ (0), హోల్డర్ (4) పరుగులు నిరాశపర్చారు. అయితే, ఆఖర్లో రావెమెన్ పొవెల్, అఖిల్ హుస్సేన్ మెరుపులు మెరిపించడంతో.. విండీస్ ఫైటింగ్ టోటల్ సాధించింది.
టీ20 వరల్డ్ కప్లో ప్రస్తుతం తొలి రౌండ్ పోటీలు జరుగబోతున్నాయి. ఇందులో 8 జట్లు పాల్గొంటాయి. జీలాంగ్, హోబర్ట్లో ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి. సూపర్-12లో ప్రస్తుతం 8 జట్లున్నాయి. మిగిలిన నాలుగు జట్ల కోసమే ఈ అర్హత మ్యాచ్లు. గ్రూప్-ఎలో నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యూఏఈ ఉండగా.. గ్రూప్-బిలో స్కాట్లాండ్, ఐర్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే పోటీపడుతున్నాయి. గ్రూప్లో ప్రతీ జట్టు ప్రత్యర్థులతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూప్ల్లో నుంచి టాప్-2 జట్లు ఈనెల 22 నుంచి జరిగే సూపర్-12లో ప్రవేశిస్తాయి. నవంబరు 13న ఫైనల్ జరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, T20 World Cup 2022, West Indies, Zimbabwe