టీ-20 ప్రపంచకప్ (T-20 World Cup 2021)లో సూపర్ విక్టరీతో భారత్ (Team India) ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఫ్లాప్ అయిన బ్యాటింగ్ ఒక్కసారిగా "సూపర్ హిట్" అయ్యింది. విలన్లుగా మారిన టీమిండియా బౌలర్లు ఒక్కసారిగా హీరోలుగా మారారు. గ్రూప్–2లో జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ ప్రతాపంతో 66 పరుగులతో నెగ్గింది.ఈ మ్యాచ్ లో భారీ తేడాతో గెలవడంతో టీమిండియా తమ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఇక, టీమిండియాకు గ్రూప్ స్టేజీలో రెండు మ్యాచులు మిగిలాయ్. సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే.. ముందుగా టీమిండియా నెక్ట్స్ తన రెండు మ్యాచుల్లో విక్టరీ కొట్టాలి. స్కాట్లాండ్, నమీబియాలతో పోరు ఈజీగానే ఉండొచ్చు. కానీ, ఆ జట్టుల్లో మంచి ఆటగాళ్లు ఉన్నారు. న్యూజిలాండ్ మ్యాచులో స్కాట్లాండ్ ఎలా చెలరేగిందో మనం చూశాం కదా. దీన్ని బట్టి ఏ జట్టును కూడా తక్కువ అంచనా వేయకుండా టీమిండియా దూకుడుగా ఆడాలి. ఈ నేపథ్యంలో శుక్రవారం స్కాట్లాండ్ తో తలపడే టీమిండియా తుది జట్టుపై ఓ లుక్కేద్దాం.
ఈ మ్యాచులో మరోసారి రోహిత్ శర్మ(Rohit Sharma), కేఎల్ రాహుల్ (KL Rahul) ఓపెనింగ్ కు దిగనున్నారు. సూర్యకుమార్ యాదవ్ అందుబాటులోకి రావడం టీమిండియాకు కలిసివస్తోంది. ఎందుకంటే అతడు స్పిన్ బౌలింగ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొగలడు. పదే పదే రవిచంద్రన్ అశ్విన్ను విస్మరిస్తుండడంపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో గత మ్యాచులో అతన్ని జట్టులోకి తీసుకువచ్చింది టీమిండియా. ఈ మార్పు టీమిండియాకు మంచి చేసిందనే చెప్పాలి. అశ్విన్ రెండు వికెట్లతో సత్తా చాటాడు.
గత మ్యాచులో చేసిన ప్రయోగాలన్నీ టీమిండియాకు కలిసివచ్చాయ్. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చినా పంత్, హార్దిక్ పాండ్యాలు బ్యాట్లతో చెలరేగారు. వారి ఇదే ఫామ్ ను కంటిన్యూ చేస్తే టీమిండియాకు తిరుగుండదు. మరోవైపు, గత మ్యాచులో కోహ్లీకి బ్యాటింగ్ కు దిగలేదు. ఈ మ్యాచులో టీమిండియా మంచి రన్ రేట్ సాధించాలంటే.. అందరూ బ్యాటర్లు రాణించాల్సేంది.
ఆఖర్లో రవీంద్రజడేజా, శార్దూల్ ఠాకూర్ వంటి ఆల్ రౌండర్లు ఉండటం టీమిండియాకు ప్లస్ పాయింట్. ప్రధాన బౌలర్లు బుమ్రా, షమీ మరోసారి సత్తా చాటాలి. గత మ్యాచ్ అఫ్గానిస్థాన్ తో తలపడిన జట్టునే టీమిండియా స్కాట్లాండ్ మీద కొనసాగించవచ్చు.
ప్రస్తుతం టీమిండియా రన్ రేట్ ప్లస్ లోకి వచ్చింది. - 1.609 నుంచి +0.073కి టీమిండియా నెట్ రన్ రేట్ పెరిగింది. మరోవైపు అఫ్గానిస్థాన్ నెట్ రన్ రేట్ +3.097 నుంచి +1.481 కి తగ్గింది. మరోవైపు న్యూజిలాండ్ రన్ రేట్ +0.816. సెమీస్ మీద ఆశలు ఉంచుకోవాలంటే స్కాట్లాండ్ ను టీమిండియా చిత్తుగా ఓడించాల్సిందే.
తుది జట్టు అంచనా :
టీమిండియా : విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా,
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ravichandran Ashwin, Rohit sharma, T20 World Cup 2021, Team India, Virat kohli