దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన వన్డే మ్యాచ్ వాయిదా పడింది. సఫారీ జట్టులోని ఓ ఆటగాడికి కరోనా సోకడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కేప్ టౌన్లో వేదికగా శుక్రవారం ఈ రెండు జట్లు మద్య మెుదలు కావాల్సిన తొలి వన్డేను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. పరీక్షల్లో దక్షిణాఫ్రికా ఆటగాడికి కోవిడ్ -19 పాజిటివ్గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే మ్యాచ్ని వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ దక్షిణాఫ్రికా కూడా ధృవీకరించింది. తాజాగా శుక్రవారం నిర్వహించిన పరీక్షలో ఆటగాడికి వైరస్ సోకినట్లు తేలిందని సీఎస్ఏ స్వయంగా ప్రకటించింది
The first #SAvENG ODI has been postponed after a South Africa player tested positive for COVID-19. pic.twitter.com/O7RNpUWGg3
— ICC (@ICC) December 4, 2020
CONFIRMED: Cricket South Africa and @ECB_cricket confirm the postponement of the first #BetwayODI of the three-match series to Sunday, 06 December 2020. #SAvENG pic.twitter.com/wRXpr7YYA9
— Cricket South Africa (@OfficialCSA) December 4, 2020
ఆటగాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా మ్యాచ్ వాయిదా వేస్తున్నట్లు క్రికెట్ దక్షిణాఫ్రికా తాత్కాలిక సిఇఒ కుగాండ్రీ గోవెందర్తో పాటు ఇసిబి సిఇఒ టామ్ హారిసన్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీమ్లోని ఆటగాళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మెడికల్ టీమ్ సమీక్షిస్తున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. #BetwayODI సిరీస్కు ముందు ప్రోటోకాల్ ప్రకారం ఆటగాళ్ళకు గురువారం COVID-19 పరీక్షల్లో ఓ ఆటగాడికి పాజీటివ్గా తెలింది. తీంతో మ్యాచ్ రద్దచేయాలని క్రికెట్ సౌత్ ఆఫ్రికా నిర్ణయించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: England, South Africa