భారత్- శ్రీలంక మధ్య జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్లకు కరోనా సెగ తగిలింది. శ్రీలంక టీమ్లో వరుసగా కరోనా కేసుల బయటపడుతుండటంతో వన్డే, టీ20 సిరీస్లను రీషెడ్యూల్ చేయాలని లంక క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు క్రిక్ బజ్ తెలిపిందిషెడ్యూల్ కంటే నాలుగు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ నెల 17న తొలి వన్డే, 19న రెండో వన్డే, 21న మూడో వన్డే జరుగనుంది. ఈ నెల 24న తొలి టీ-20 మ్యాచ్ జరుగనుండగా.. 25న రెండో మ్యాచ్, 27న మూడో మ్యాచ్ జరుగనుంది. ఇంతకు ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సిరీస్ ఈ నెల 13 తేదీన ప్రారంభం కావాల్సి ఉంది. ఈ షెడ్యూల్ శ్రీలంక క్రికెట్ బోర్డు రేపు ప్రకటించే అవకాశం ఉంది. భారత్తో సిరీస్కు ముందు శ్రీలంక జట్టులో కరోనా కేసులు బయటపడ్డాయి. ఇటీవల ఇంగ్లండ్కు వెళ్లి వచ్చిన టీమ్లో మొదట బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కరోనా బారినపడగా.. ఆ తర్వాత టీమ్ డేటా అనలిస్ట్ జీటీ నిరోషన్కు సైతం కరోనా సోకింది. ప్రస్తుతం కరోనా ఇద్దరూ.. చికిత్స పొందుతున్నారని శ్రీలంక క్రికెట్ ఒక ప్రకటనలో తెలిపింది.
శ్రీలంక జట్టు ఇంగ్లండ్లో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడింది. ఆ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ టీమ్లో ముగ్గురు ప్లేయర్స్ సహా మొత్తం ఏడుగురికి కరోనా సోకినట్లు గుర్తించారు. అక్కడికి నుంచి స్వదేశానికి వచ్చిన శ్రీలంక టీమ్కు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా.. గ్రాంట్ ఫ్లవర్, నిరోషన్ వైరస్ బారినపడ్డట్లు తేలింది. అయితే ఆటగాళ్లకు మాత్రం నెగటీవ్ వచ్చిందని పేర్కొంది. ఫ్లవర్, నిరోషన్లు ప్రస్తుతం క్వారంటైన్లో ఉండి.. చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, Corona effect, India vs srilanka, Shikhar Dhawan