హోమ్ /వార్తలు /క్రీడలు /

Tokyo Olympics: క్వార్టర్ ఫైనల్‌లో పీవీ సింధు.. పతకానికి మరింత చేరువగా..

Tokyo Olympics: క్వార్టర్ ఫైనల్‌లో పీవీ సింధు.. పతకానికి మరింత చేరువగా..

క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న పీవీ సింధు (Twitter)

క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న పీవీ సింధు (Twitter)

స్టార్ షట్లర్ పీవీ సింధు ఒలింపిక్ పతకానికి మరింత దగ్గరైంది. ప్రీక్వార్ట్స్‌లో విజయం సాధించి వడివడగా దూసుకొని పోతున్నది.

టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics 2020) 6వ రోజు భారత అథ్లెట్లు (Indian Athletes) శుభారంభం చేశారు. మహిళల బ్యాడ్మింటన్ (Badminton) సింగిల్స్‌లో భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు (PV Sindhu) రౌండాఫ్ 16లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నది. గురువారం ఉదయం డెన్మార్క్‌కు చెందిన 12వ ర్యాంక్ క్రీడాకారిణి బ్లింక్ ఫెల్ట్‌పై 21-15, 21-13 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరుకున్నది. మ్యాచ్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించిన సింధు.. ఏ దశలోనూ పట్టు విడువకుండా ఆడింది. ప్రత్యర్థికి కనీసం కోలుకునే అవకాశం కూడా లేకుండా వరుసగా రెండు గేమ్స్ సాధించి.. పతకానికి మరో మూడు అడుగుల దూరంలో నిలిచింది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు పూర్తి నిలకడగా ఆడి తన ఫామ్‌ను కొనసాగించింది.


గురువారం మధ్యాహ్నం పీవీ సింధు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడనున్నది.

First published:

Tags: Olympics, Pv sindhu, Tokyo Olympics

ఉత్తమ కథలు