దేశంలో బ్యాడ్మింటన్కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ నడుం బిగించింది. తమ అకాడమీ బ్యాడ్మింటన్ సేవలను మరింత విస్తరించేందుకు కొటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్తో గోపీచంద్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కొటక్ సహకారంతో గోపీచంద్ అకాడమీలో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, రీసెర్చ్&డెవలప్మెంట్ సెంటర్ను నిర్మించనున్నారు. బ్యాడ్మింటన్ ఔత్సాహికులకు వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ సదుపాయాలను కల్పించేందుకే కొటక్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు గోపీచంద్ తెలిపారు.
కొటక్ అందించే సహకారంతో గచ్చిబౌలిలోని తమ అకాడమీ పక్కనే మరో ఆరు అధునాతన బ్యాడ్మింటన్ కోర్టులను నిర్మించనున్నట్టు గోపీచంద్ తెలిపారు. దాంతో పాటు స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, ట్రైనింగ్ సెంటర్ నిర్మిస్తామని చెప్పారు. చాలా దేశాల్లో లాగా మనదేశంలో చిన్నతనం నుంచే క్రీడాకారులను తీర్చిదిద్దే పరిస్థితి లేదని.. దీన్ని మార్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Pullela Gopichand, Saina Nehwal