PKL 2021-22 : యూపీ యోధను చిత్తు చేసిన బెంగాల్ వారియర్స్.. తొలి రోజు కూత అదుర్స్..

PKL 2021-22 : క్రీడా అభిమానుల్ని ఉర్రూతలూగిస్తూ ప్రొ కబడ్డీ మళ్లీ వచ్చేసింది. తొలి రోజు కూత కూడా అదిరింది. ఫస్ట్ మ్యాచ్ లో యు ముంబా దుమ్మురేపింది. సెకండ్ మ్యాచ్ లో నువ్వా- నేనా అన్నట్టుగా తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ తలపడ్డాయ్. దీంతో రెండో మ్యాచ్ 40-40 తో టైగా ముగిసింది. ఇక, మూడో మ్యాచులో బెంగాల్ వారియర్స్ 38-33 తేడాతో యూపీ యోధను చిత్తు చేసింది.

  • News18 Telugu
  • | December 22, 2021, 23:15 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED A YEAR AGO

    AUTO-REFRESH

    Highlights

    23:14 (IST)
    23:9 (IST)

    ఇక, ఫస్ట్ డే జరిగిన మూడో మ్యాచులో బెంగాల్ వారియర్స్ 38-33 తేడాతో యూపీ యోధను చిత్తు చేసింది. ఫస్టాఫ్ లో రెండు జట్లు 18-18 తో సమానంగా నిలిచినప్పటికీ.. సెకండాఫ్ లో బెంగాల్ వారియర్స్ దుమ్మురేపారు. బెంగాల్ వారియర్స్ లో ఇస్మాయిల్ నభీభక్ష్ 11 పాయింట్లతో దుమ్మురేపాడు. యూపీ యోధలో స్టార్ రైడర్ పరదీప్ నర్వాల్ కేవలం 8 పాయింట్లు మాత్రమే చేసి నిరాశపర్చాడు. 

    22:2 (IST)
    21:52 (IST)

    ఆఖరి 5 నిమిషాల్లో తెలుగు టైటాన్స్ దూకుడుగా ఆడారు. దుమ్మురేపే ప్రదర్శనతో వరుసగా 10 పాయింట్లు సాధించారు. ప్రస్తుతం స్కోరు 40-40 తో సమానమైంది.  దీంతో మ్యాచ్ టై గా ముగిసింది. 

    21:41 (IST)

    తెలుగు బాహుబలి సిద్దార్ధ్ దేశాయ్ ఫస్టాఫ్ లో 7 పాయింట్లతో సత్తా చాటాడు. కానీ సెకండాఫ్ లో తమిళ్ తలైవాస్ సిద్ధార్ధ్ దేశాయ్ ఆటలు సాగనివ్వడం లేదు. 

    21:38 (IST)

    ఫస్టాఫ్ లో నువ్వా-నేనా అన్నట్టుగా పోరాడిన.. తెలుగు టైటాన్స్ సెకండాఫ్ లో చేతులేత్తేసింది. ప్రస్తుతం 29-38 పాయింట్లతో వెనుకబడి ఉంది. 

    21:30 (IST)

    తమిళ తలైవాస్ లో మన్ జీత్ 9 పాయింట్లతో దుమ్మురేపుతున్నాడు. ఇక, తెలుగు టైటాన్స్ లో సిద్ధార్ధ్ దేశాయ్ 7 పాయింట్లతో రాణిస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు టైటాన్స్ 28-30 స్కోరుతో వెనుకబడి ఉంది. 

    21:12 (IST)
    21:9 (IST)

    హాఫ్‌ టైమ్‌ ముగిసే సమయానికి లీడ్‌లో తమిళ్‌ తలైవాస్‌..

    తెలుగు టైటాన్స్‌, తమిళ్‌ తలైవాస్‌ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ఇరుజట్లు మంచి ఆటను కనబరిచారు. ఈ క్రమంలోనే నువ్వునేనా అన్నట్లు సాగిన ఫస్టాఫ్‌ ముగిసే సమయానికి తెలుగు టైటాన్స్‌ 21, తమిళ్‌ తలైవాస్‌ 23 పాయింట్లతో ఉన్నారు.

    21:8 (IST)

    తమిళ తలైవాస్ మళ్లీ రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం రెండు జట్లు 20-20 పాయింట్లతో సమానంగా ఉన్నాయ్.

    కబడ్డీ (Kabaddi).. కబడ్డీ.. కబడ్డీ.. కబడ్డీ.. ఈ కూత వింటేనే ఒళ్లంతా పూనకం వస్తుంది. చిన్నప్పుడు స్కూల్ లో ఆడిన జ్ఞాపకాలు మదిలో మెదలాల్సిందే. మాయదారి రోగం కరోనా కారణంగా గతేడాది వాయిదాపడ్డ మనదైన క్రీడ ప్రో కబడ్డీ 8వ సీజన్ (Pro Kabaddi 8th Season) మళ్లీ మీ ముందుకు వచ్చేసింది. ఇక, ఫస్ట్ మ్యాచ్ లో యూ ముంబా చేతిలో 46-30 తేడాతో చిత్తుగా ఓడింది బెంగళూరు బుల్స్. ఇక తొలిరోజే తెలుగు టైటాన్స్‌ మ్యాచ్‌ ఉండడంతో అందరూ టీవీలు, మొబైల్‌ ఫోన్‌లకు అతుక్కుపోయారు.  అందుకు తగ్గట్టే మ్యాచ్ జరిగింది. రెండు జట్ల ఆటగాళ్లు నువ్వా-నేనా అన్నట్టుగా పోరాడారు.

    ఫస్టాఫ్ ముగిసే సమయానికి 21-23 తేడాతో తమిళ్ తలైవాస్ ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్ లో కూడా తమిళ్ తలైవాస్ దూసుకుపోయారు. ఏకంగా 29-36 తేడాతో ఆధిక్యంలో నిలిచారు. కానీ, ఆఖరి 5 నిమిషాల్లో తెలుగు టైటాన్స్ రెచ్చిపోయారు. దీంతో మ్యాచ్ 40-40 తేడాతో టైగా ముగిసింది.

    ఇక, ఫస్ట్ డే జరిగిన మూడో మ్యాచులో బెంగాల్ వారియర్స్ 38-33 తేడాతో యూపీ యోధను చిత్తు చేసింది. ఫస్టాఫ్ లో రెండు జట్లు 18-18 తో సమానంగా నిలిచినప్పటికీ.. సెకండాఫ్ లో బెంగాల్ వారియర్స్ దుమ్మురేపారు. బెంగాల్ వారియర్స్ లో ఇస్మాయిల్ నభీభక్ష్ 11 పాయింట్లతో దుమ్మురేపాడు. యూపీ యోధలో స్టార్ రైడర్ పరదీప్ నర్వాల్ కేవలం 8 పాయింట్లు మాత్రమే చేసి నిరాశపర్చాడు.