భారత్లో క్రికెట్ ఓ మతం. అత్యధిక ప్రేక్షధారణ కలిగిన క్రీడాగా అభిమానుల నరానరాలలో పాకిపోయింది. ఆ ఆటకే కాదు క్రికెటర్స్ అంత క్రేజీ.
వారు ఎక్కడ ఉన్న ఏమి చేసిన ప్రతి క్షణం వారిని అభిమానులు ఫాలోచేస్తునే ఉంటారు. ఇక ధోనీ లాంటి స్టార్ ఆటగాళ్ళ విషయం అది మరి ఎక్కువ. ఇప్పటి వరకు ఉన్న అందరి క్రికెటర్స్ కంటే కూడా ధోనీ ఫ్యాన్ ఫాలోంగ్ ఎక్కువ.
కీపర్గా,సారథిగా,బాట్స్మెన్గా క్రికెట్ చేసిన సేవలు అమోఘం. టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్.. ఇండియన్ టెర్రిటోరియల్ ఆర్మీలో లెఫ్టనెంట్ కల్నల్.. ఇలా చెప్పుకంటే పోతే మరెన్నో... అలాగే ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్. అతని దగ్గర డబ్బుకు కొదవే ఉండదు కానీ అలాంటి ధోనీ జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్కు రూ.1800 బాకీ పడ్డారంటా.
అసోసియేషన్కు సంబంధించిన మెంబర్షిప్ ఫీజు ఇంకా చెల్లించలేదట. ఇప్పుడు ఈ విషయం తీవ్ర దుమారాన్నే రేపింది. తాజాగా జేఎస్సీఏ విడుదల చేసిన వార్షిక రిపోర్ట్లో ధోనీ రూ.1800 బాకీ ఉన్న తెలింది. అసోసియేషన్లో శాశ్వత సభ్యత్వం కావాలంటే రూ.10,000 సభ్వత్వ ఫీజుతో పాటు జీఎస్టీతో కలిపిమొత్తం రూ.11,800 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ధోనీ రూ.10,000 మాత్రమే చెక్కు రూపంలో చెల్లించాడు. ఇంకా జీఎస్టీ సోమ్ము రూ. 1800 బాకీ ఉన్నట్లు జేఎస్సీఏ తన రిపోర్టులో చూపించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.