హోమ్ /వార్తలు /క్రీడలు /

Khelo India Youth Games 2023 : ఖేలో ఇండియాలో మెరిశారు.. ఒలింపిక్స్ లో బెర్త్ పట్టేశారు.. యంగ్ గన్స్ ఎవరంటే?

Khelo India Youth Games 2023 : ఖేలో ఇండియాలో మెరిశారు.. ఒలింపిక్స్ లో బెర్త్ పట్టేశారు.. యంగ్ గన్స్ ఎవరంటే?

PC : TWITTER

PC : TWITTER

Khelo India Youth Games 2023 : క్రీడల్లో ప్రతిభ ఉన్నా తమను తాము నిరూపించుకునేందుకు సరైన ప్లాట్ ఫామ్ కావాలి. ముఖ్యంగా దేశంలోని మారుమూల పల్లెల్లోని వారికి ఇది చాలా కష్టంగా ఉంటుంది. జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో మెరిసినా పెద్దగా గుర్తింపు వచ్చేది కాదు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Khelo India Youth Games 2023 : క్రీడల్లో ప్రతిభ ఉన్నా తమను తాము నిరూపించుకునేందుకు సరైన ప్లాట్ ఫామ్ కావాలి. ముఖ్యంగా దేశంలోని మారుమూల పల్లెల్లోని వారికి ఇది చాలా కష్టంగా ఉంటుంది. జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో మెరిసినా పెద్దగా గుర్తింపు వచ్చేది కాదు. అయితే ఖేలో ఇండియా (Khelo India) ఎంట్రీతో ఇదంతా మారిపోయింది. ఐదేళ్ల కిందట దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) చేతుల మీదుగా 2018లో ఈ ప్రోగ్రామ్ ఘనంగా ఆరంభమైంది. 17 ఏళ్లలోపు బాలబాలికలు తమలో ఉన్న స్పోర్ట్స్ ట్యాలెంట్ ను బయటపెట్టేందుకు ఖేలో ఇండియా సరైన వేదిక. ఇక్కడ పతకాలతో మెరిసిన బాలబాలికలు ఆ తర్వాత విశ్వవేదికలపైనా అదరగొట్టారు. ఈ క్రమంలో ఖేలో ఇండియా గుర్తించిన కొన్ని మట్టిలోని మాణక్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఖేలో ఇండియా టు ఒలింపిక్స్‌

2020 టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు అదిరిపోయే ప్రదర్శన చేశారు. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ తో భారత ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు పెంచాడు. రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ లో కూడా భారత ప్లేయర్లు పతకాలతో మెరిశారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో భారత్ టోక్యో ఒలింపిక్స్‌లో అత్యధికంగా 7 పతకాలు గెలిచింది. ఇదే ఓ అద్భుతం అనుకుంటే.. ఈ ఒలింపిక్స్‌కు వెళ్లిన వారిలో ఖేలో ఇండియాలో పాల్గొన్న అథ్లెట్లు కూడా ఉండటం మరో విశేషం.

2018 జనవరి-ఫిబ్రవరి నెలల్లో జరిగిన తొలి ఖేలో ఇండియా గేమ్స్ లో మను భాకర్ షూటింగ్ లో పాల్గొంది. అందులో ఆమె గోల్డ్ మెడల్ తో అదరగొట్టింది. ఆ తర్వాత అదే ఏడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొని అక్కడ కూడా బంగారు పతకంతో మెరిసింది. ఈ క్రమంలో ఆమె టోక్యో ఒలింపిక్స్ లో బెర్త్ కూడా పట్టేసింది. అయితే టోక్యోలో పతకం సాధించకపోయినా.. ఖేలో ఇండియా ద్వారా అక్కడి వరకు చేరుకుంది. ఈమె బాటలోనే మను బాకర్‌, సౌరబ్‌ చౌదరి (పిస్టల్ షూటర్), అన్షు మాలిక్‌ (రెజ్లర్), శ్రీహరి నటరాజ్‌ (స్విమ్మర్) వంటి టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లు ఈ ఖేలో ఇండియా ద్వారా వెలుగులోకి వచ్చిన వాళ్లే. వీళ్లు మెడల్స్‌ గెలవకపోయినా.. ఒలింపిక్స్‌ వంటి అంతర్జాతీయ వేదికపై తమ నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం దక్కింది. భవిష్యత్తులో విజయాలు సాధించడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని వారికి అందించింది.

మధ్యప్రదేశ్ వేదికగా 2023 ఖేలో ఇండియా గేమ్స్

మధ్యప్రదేశ్ వేదికగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 ఐదో ఎడిషన్ జరగనున్నాయి. రాజధాని భోపాల్ లో ఈ పోటీలు జరగనున్నాయి. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనున్నాయి. మొత్తం 23 ఈవెంట్స్ లో 6 వేల మంది అథ్లెట్లు పోటీ పడనున్నారు.

First published:

Tags: Bhopal, Games, Khelo India Youth Games, Madhya pradesh, School Games, Sports

ఉత్తమ కథలు