టోక్యో ఒలింపిక్స్ 2020 (Tokyo Olympics 2020) క్రీడల్లో జపాన్ క్రీడాకారిణి (Japan Athlete) మోమిజి నిషియా (Nishiya Moniji) రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్లో అతి చిన్న వయసులోనే వ్యక్తిగత స్వర్ణం గెలిచిన అథ్లెట్గా రికార్డులకు ఎక్కింది. ఒలింపిక్స్లో ఈ ఏడాది నుంచే స్కేట్ బోర్డింగ్ను ప్రవేశపెట్టారు. ఇందులో మహిళల స్కేట్ బోర్డింగ్లో పాల్గొన్న మోమిజి స్వర్ణం గెలిచింది. ఆమె వయసు 13 ఏళ్ల 330 రోజులు. కాగా స్కేట్ బోర్డింగ్లో ఫైనల్ చేరిన అమ్మాయిల సగత వయసు 14 ఏళ్లలోపే ఉండటం గమనార్హం. నిషియా స్కేట్ రన్లో 3.02 పాయింట్లు.. ట్రిక్లో 4.15, 4.66, 3.43 పాయింట్లు.. మొత్తం 15.26 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. మరోవైపు కాంస్య పతకం గెలిచిన జపాన్ అమ్మాయి నకయామా ఫనా వయసు 16 ఏళ్లు. బ్రెజిల్కు చెందిన లియాల్ రేసా 14.64 వయసులో రజత పతకం సాధించింది. ఆమె వయసు 13 ఏళ్ల 203 రోజులు.
NISHIYA Momiji?? has won the #Olympics first female #Skateboarding #gold medal - women's street at #Tokyo2020 #UnitedByEmotion | #StrongerTogether pic.twitter.com/6eICFyYcZB
— #Tokyo2020 (@Tokyo2020) July 26, 2021
A historic first on home soil!#JPN's Nishiya Momiji is the first women's Olympic #Skateboarding champion!@worldskatesb @Japan_Olympic pic.twitter.com/6W6ReQE3BS
— Olympics (@Olympics) July 26, 2021
స్కేట్ బోర్డింగ్ ప్రవేశ పెట్టిన టోక్యో లోనే స్వదేశానికి చెందిన ఇద్దరు పతకాలు గెలవడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tokyo, Tokyo Olympics